हिन्दी | Epaper

DGCA : పాక్‌ గగనతలం మూసివేత.. విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ జారీ

sumalatha chinthakayala
DGCA : పాక్‌ గగనతలం మూసివేత.. విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ జారీ

DGCA : పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయగా, పాక్ కూడా ప్రతిచర్యకు దిగింది. భారత విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. దీనివల్ల విమాన ప్రయాణాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. ఈ మేరకు డీజీసీఏ విమానయాన సంస్థలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ప్రయానికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించింది.

పాక్‌ గగనతలం మూసివేత.. విమానయాన

అందుకు ప్రతీగా పాక్ కూడా చర్యలు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం భారత్-పాకిస్థాన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించే దశలో ఉన్నాయి. ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే.. అందుకు ప్రతీగా పాక్ కూడా చర్యలు ప్రారంభించింది. భారత్‌ నుంచి వచ్చే విమానాలను తమ గగనతలంలోకి రాకుండా నిషేధిస్తూ ఆంక్షలు జారీ చేసింది. పాక్ నిర్ణయం నేపథ్యంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ డీజీసీఏ విమానయాన సంస్థలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

కచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించాలి

పాక్‌ గగనతలం మూసివేత కారణంగా భారత్ ఎయిర్‌లైన్‌ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని డీజీసీఏ పేర్కొంది. దాయాది దేశం తీసుకున్న నిర్ణయం కారణంగా.. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించి ప్రయాణ సమయం మరింత పెరగనున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈనేపథ్యంలో విమానయాన సంస్థలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించాలని డీజీసీఏసూచించింది.

Read Also: కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..28 మంది మావోయిస్టులు మృతి !

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

📢 For Advertisement Booking: 98481 12870