తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ మరియు జనవరి నెలల్లో తిరుమలలో జరగనున్న ముఖ్య పర్వదినాల కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది.
డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నందున, ఆ రోజున వీఐపీ బ్రేక్(VIP Break) దర్శనం ఉండదని వెల్లడించింది. అలాగే వైకుంఠ ఏకాదశి ముందు రోజు అయిన డిసెంబర్ 29న కూడా ఈ దర్శనాలను నిలిపివేసింది.
Read Also: Tirumala: నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

వైకుంఠ ద్వార దర్శనాలు
డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నందున, ఈ కాలంలో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవని టీటీడీ(TTD) ప్రకటించింది. అదేవిధంగా జనవరి 25న రథసప్తమి సందర్భంగా కూడా ఈ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపింది.
అయితే, ప్రోటోకాల్(protocol) పరిధిలో ఉన్న ప్రముఖులకు మాత్రం దర్శన అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది. అలాగే రద్దు చేసిన రోజులకు ముందు రోజు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని భక్తులు ముందస్తుగా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: