हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

TTD:సెప్టెంబర్ 24 నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Sharanya
TTD:సెప్టెంబర్ 24 నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

భక్తుల ఉల్లాసానికి కేంద్రబిందువుగా మారే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం (Starting from September 24) కానున్నాయి. ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఉత్సవాలకై భద్రత, ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని, టీటీడీ సీవీ & ఎస్వో మురళీకృష్ణ ఆధ్వర్యంలో అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజిలెన్స్, ఫైర్‌, ఎస్పీఎఫ్‌, ట్రాఫిక్ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని భద్రతా చర్యలపై (On security measures) చర్చించారు.

TTD
TTD

CM చంద్రబాబు పాల్గొనే ప్రారంభ కార్యక్రమం

బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజున, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.

ప్రతి రోజూ ప్రత్యేక వాహన సేవలు – భక్తుల కోసం ఏర్పాట్లు

ఉత్సవాల్లో భాగంగా, ప్రతిరోజూ శ్రీవారికి వాహన సేవలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన రోజుల్లో పెద్దశేష వాహన సేవ, గరుడ వాహన సేవ, రథోత్సవం, చక్రస్నానం వంటి రోజుల్లో భద్రతను మరింత పటిష్ఠంగా నిర్వహించనున్నారు.

కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా

ఈసారి భద్రతను మరింత సాంకేతికంగా నిర్వహించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలలోని ప్రతి మూలమూలపై నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలు, మానిటరింగ్ సిస్టమ్‌లను వినియోగించనున్నారు. ప్రవేశ మార్గాలు, నిష్క్రమణ మార్గాలు, గ్యాలరీలు, ట్రాఫిక్ ,నిర్వహణ ,ప్రత్యేక పార్కింగ్ జోన్‌లు అన్ని సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ స‌మావేశంలో టీటీడీ వీజీవోలు శ్రీ రామ్ కుమార్‌, శ్రీ సురేంద్ర‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/duvvada-srinivas-case-registered-over-remarks-on-pawan-kalyan/andhra-pradesh/525116/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870