మహాశివరాత్రి(Shivaratri2026) పండుగ కేవలం ఆచారం మాత్రమే కాదు, మనసును శుద్ధి చేసుకుని శివతత్త్వాన్ని అనుభవించే పవిత్ర సందర్భం. 2026లో ఈ పర్వదినాన్ని ఫిబ్రవరి 15న భక్తులు ఘనంగా జరుపుకోనున్నారు.
Read Also: Tirumala: శ్రీవారి సేవలో నిధి అగర్వాల్

శివపూజ సమయంలో కొన్ని వస్తువులను సమర్పించడం నిషిద్ధంగా పరిగణిస్తారు. సింధూరం, కుంకుమ, తులసి ఆకులు, శంఖం లేదా శంఖజలం వంటి పదార్థాలను శివలింగానికి(Shivaratri2026) అర్పించరాదు. శివలింగానికి నెమ్మదిగా నీటితో అభిషేకం చేయాలి. పాలాభిషేకం చేయాలంటే వెండి పాత్రలో చేయడం శ్రేష్ఠమని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ రోజున ఉపవాసం ఉండటం ద్వారా మనసు, వాక్కు, ఆలోచనలను పరిశుద్ధం చేసుకోవచ్చని విశ్వాసం. కోపం, అసహనం, ప్రతికూల భావాల నుంచి దూరంగా ఉండాలి. “ఓం నమః శివాయ” మంత్ర జపం ద్వారా శివుని కృప పొందవచ్చని భక్తులు విశ్వసిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: