हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Bonalu 2025: హైదరాబాద్‌లో ఘనంగా లాల్‌దర్వాజ బోనాల ఉత్సవం

Anusha
Bonalu 2025: హైదరాబాద్‌లో ఘనంగా లాల్‌దర్వాజ బోనాల ఉత్సవం

ఆషాడ మాసం ముగింపు దశకు చేరుకోవడంతో భాగ్యనగరం హైదరాబాద్‌లో బోనాల సంబురాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. నగరంలో ప్రతి వీధి పండుగ వాతావరణాన్ని ధరించుకుంది. మహిళలు బోనాలు మోస్తూ అమ్మవారి పాటలతో జోరుగా ఊరేగిపోతుండగా, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు వాతావరణాన్ని ఓ వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నాయి. గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఈ బోనాల ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఆషాడ మాసం తొలి గురువారం గోల్కొండ కోట (Golconda Fort) లో జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడం ద్వారా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తుది ఆదివారం సందర్భంగా పాత బస్తీలోని ప్రసిద్ధ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడంతో ఈ సంవత్సరం బోనాల ఘనత ముగిసింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయంలో మహాభిషేకం, ధూప దీప నైవేద్యాలు, ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించడంతో భక్తులు ఆస్వాదించారు. ప్రత్యేకంగా నిర్వహించిన బలిహరణం, అభిషేక కార్యక్రమాల తర్వాత భక్తులు తమ బోనాలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ఆలయ అధికారులు

ఈ ఉత్సవాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ సింహవాహిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కూడా బోనం సమర్పించి భక్తిగా పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లాల్‌దర్వాజ ప్రాంతం (Lal Darwaza area) మొత్తాన్ని భక్తులు కమ్మేసారు. ఆలయ పరిసరాలను సందర్శించేందుకు వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గంటల తరబడి నిలబడి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కోసం ప్రజలు నిరీక్షించారు. వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.భద్రత దృష్ట్యా సుమారు 2500 మంది పోలీసులతో ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ నియంత్రణతో పాటు అత్యవసర సౌకర్యాలన్నింటిని సిద్ధం చేశారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించబడింది.

Bonalu 2025:  హైదరాబాద్‌లో ఘనంగా లాల్‌దర్వాజ బోనాల ఉత్సవం
Bonalu 2025: హైదరాబాద్‌లో ఘనంగా లాల్‌దర్వాజ బోనాల ఉత్సవం

మేళతాళాల శబ్దాలతో

హైదరాబాద్ నగరం ఈ రోజు అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోయింది. బోనాల ముగింపు సందర్భంగా ఆధ్యాత్మికత, సాంస్కృతికత సమ్మేళనంతో నగరం ఉత్సాహభరితంగా మారింది. వేపాకుల తోరణాలు, బోనల తళుకులు, మేళతాళాల శబ్దాలతో మెరిసింది. భాగ్యనగరం ప్రతి మూలలో బోనాల మహోత్సవం ప్రతిధ్వనించింది. అమ్మవారికి దర్శించుకోవడం సంతోషంగా ఉందని బీజేపీ మహిళా నాయకురాలు మాదవీలాత (Madhavilatha) అన్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటున్నారు.

హైదరాబాదులో రెండవ బోనాలు ఎక్కడ జరుగుతాయి?

హైదరాబాద్‌లో రెండవ బోనాల ఉత్సవాలు సాధారణంగా బల్కంపేట యల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం,రెజిమెంటల్ బజార్‌లోని గండిమైసమ్మ దేవాలయంలో జరుగుతాయి.

హైదరాబాద్‌లో మొదటి బోనాలు ఎక్కడ జరుగుతాయి?

హైదరాబాద్‌లో మొదటి బోనాలు గోల్కొండ కోటలో నిర్వహించబడతాయి. 2025 సంవత్సరానికి గానూ బోనాల ఉత్సవాలు జూన్ 29న గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతాయి. మొదటి పూజలు, ఉత్సవ కార్యక్రమాలు ఇదే తేదీన అక్కడ జరుగుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Hyderabad Metro: హైదరాబాద్ సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణ..రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870