ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హాల్ టికెట్లను మార్చి 18వ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది.గతేడాది మే 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఇటీవల విడుదల చేసిన ఏపీపీఎస్సీ, అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్ష రాయడానికి అనుమతించింది. రాష్ట్రవ్యాప్తంగా 28,451 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 18,037 మంది (82.02%) అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.
మెయిన్స్ పరీక్షల వివరాలు
మెయిన్స్ రాత పరీక్షలు మార్చి 26, 27 తేదీల్లో ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. మెయిన్ పరీక్షలు మొత్తం 3 పేపర్లకు జరగనున్నాయి. ఈ మూడు పేపర్లు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటాయి. పేపర్ 1 పరీక్ష మార్చి 26 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 2 పరీక్ష మార్చి 27న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 3 పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
పోస్టుల భర్తీ ,నియామక ప్రక్రియ
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. చివరగా మెరిట్ లిస్ట్ ఆధారంగా అంతిమ ఎంపిక ప్రకటన ఉంటుంది.

అభ్యర్థులకు సూచనలు
హాల్ టికెట్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని భద్రంగా ఉంచుకోవాలి. పరీక్షా కేంద్రానికి పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందు హాజరు కావాలి. పరీక్ష సమయంలో చీటింగ్ లేదా నిబంధనలకు విరుద్ధమైన పనులు చేయడం కఠినంగా నిషేధించబడింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక తప్పనిసరి గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) తీసుకురావాలి. అధికారిక సమాచారం కోసం ఏపీపీఎస్సీ వెబ్సైట్ను తరచుగా పరిశీలించాలి.