Delhi Elections.. 33.31 percent polling till 1 hour

ఢిల్లీ ఎన్నికలు..1 గంట వరకూ 33.31శాతం పోలింగ్‌..

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంట వరకూ 33.31 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

image

ఈసీఐ వివరాల ప్రకారం..అన్ని జిల్లాల్లో కంటే నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్‌లో అత్యధికంగా 39.51 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీ సెంట్రల్ జిల్లాలో అత్యల్పంగా 29.74 శాతం పోలింగ్ నమోదైంది. సౌత్ వెస్ట్ జిల్లాలో 35.44 శాతం, న్యూఢిల్లీలో 29.89 శాతం, ఈస్ట్ 33.66 శాతం, నార్త్ 32.44 శాతం, న్యూఢిల్లీ 29.89 శాతం, ఈస్ట్ 33.36 శాతం, నార్త్ 32.44 శాతం, నార్త్ వెస్ట్ 33.17 శాతం, షహదర 35.81 శాతం, సౌత్ 32.67 శాతం, సౌత్ ఈస్ట్ 32.27 శాతం, వెస్ట్ 30.89 శాతం పోలింగ్ నమోదైంది. ఇక, సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు పార్టీల నేతలు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరోవైపు, మిల్కిపూర్‌ (ఉత్తరప్రదేశ్) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు రికార్డు స్ధాయిలో 44.59 శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గం ఉప ఎన్నికలో 42.41 శాతం ఓటింగ్ నమోదైంది. ఈరోడ్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికను సమాజ్‌వాదీ పార్టీ, భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

Related Posts
USA: అణ్వాయుధాలను తమ దేశంలో మోహరించాలన్న పోలాండ్ విజ్ఞప్తికి ట్రంప్ నో
విద్యాశాఖను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు

రష్యా దూకుడును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తమ దేశంలో అమెరికా అణ్వాయుధాలను మోహరించాలి అనే పోలాండ్ అభ్యర్థనను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ విషయాన్ని Read more

‘ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్‌బర్గ్’ ప్రారంభం
Organic Creamery by Iceberg

'Organic Creamery by Iceberg' హైదరాబాద్‌: భారతదేశపు మొట్టమొదటి ఆర్గానిక్ ఐస్ క్రీం బ్రాండ్ అయిన ఐస్‌బర్గ్ విస్తరణ దిశలో ఉంది. ప్రీమియం బ్రాండ్ 'ఆర్గానిక్ క్రీమరీ Read more

ఆశా వర్కర్లకు గుడ్​న్యూస్​..వయోపరిమితి పెంపు..
Good news for Asha workers..increase in age limit

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశా వర్కర్లపై వరాల జల్లు కురిపించారు. ఆశా కార్యకర్తల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. వారికి మొదటి 2 Read more

తెలంగాణ లో పెరిగిన ఎండలు – రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్
Electricity demand at recor

ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో విద్యుత్తు వినియోగం తెలంగాణలో ఎండల ప్రభావం ముందుగానే చూపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల నుంచే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో, విద్యుత్ వినియోగం కూడా రికార్డు Read more