Delhi CM Rekha Gupta meet Prime Minister Modi

ప్రధాని మోడీతో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భేటీ

రేఖా గుప్తాకు ప్రధాని మోడీ పలు సలహాలు, సూచనలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శనివారం ఉదయం కలిశారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధానితో భేటీ సందర్భంగా మోడీ ఆమెకు పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సమాచారం. అంతకుముందు రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని తాను చదువుకున్న కాలేజీకి వెళ్లారు. అక్కడ ప్రిన్సిపల్, విద్యార్థులను కలిసి మాట్లాడారు.

ప్రధాని మోడీతో ఢిల్లీ సీఎం

మూడు రోజులపాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

ఈ సందర్భంగా రేఖాగుప్తా మాట్లాడుతూ.. ఇక్కడ చదివిన రేఖా గుప్తా మాత్రమే కాదు మీరంతా కూడా సీఎంలు కావాలని విద్యార్థులతో అన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ రేఖా గుప్తాకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. కాగా ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ సర్కారు.. సోమవారం నుంచి అంటే ఫిబ్రవరి 24 నుంచి మూడు రోజులపాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతోంది.

25న ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్‌ నివేదిక

ఫిబ్రవరి 24న నూతన అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్‌ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరిచేత ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. అనంతరం స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. ఫిబ్రవరి 25న ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టనుంది. కాగ్‌ నివేదికపై ఫిబ్రవరి 25, 27 తేదీల్లో చర్చ జరగనుంది.

Related Posts
Waqf Amendment Bill : ఎల్లుండే లోక్సభలోకి వక్స్ సవరణ బిల్లు?
Waqf Amendment Bill 2

వక్ఫ్ చట్టం భారతదేశంలో ముస్లిం సమాజానికి సంబంధించిన ధార్మిక, సామాజిక అంశాలను పరిరక్షించడానికి రూపొందించబడింది. కానీ ప్రస్తుత చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. Read more

భారతదేశం GSAT-N2 కోసం స్పేస్‌ఎక్స్ ఎంపిక..
gsatn2

భారతదేశం యొక్క GSAT-N2 ఉపగ్రహం, కా-బ్యాండ్ సాంకేతికతతో రూపొందించబడిన ఒక హై-త్రోపుట్ ఉపగ్రహం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ వీడియో Read more

తల్లిదండ్రుల అనుమతితో సోషల్ మీడియా!
తల్లిదండ్రుల అనుమతితో సోషల్ మీడియా!

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ నిబంధనల (DPDP) ముసాయిదా ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు ఇప్పుడు Read more

సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసుల నోటీసులు
Mangalagiri Police Notices to YCP Leaders Sajjala Ramakrishna Reddy

అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతల మెడ చుట్టూ బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన పోలీసులు తాజాగా Read more