deaths of witnesses in my father case are suspicious: Sunitha

YS Vivekananda: మా నాన్న కేసులో సాక్షులు చనిపోవడం అనుమానాస్పదమే : సునీత

YS Vivekananda : వైఎస్‌ వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో ఉన్న సాక్షులు చనిపోవడం కచ్చితంగా అనుమానాస్పదమే అంటూ బాంబ్‌ పేల్చారు. తన తండ్రి వైఎస్‌ వివేకా హత్య జరిగి ఆరేళ్లైనా నిందితులందరూ బయటే తిరుగుతున్నారని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఆగ్రహించారు. ఈ కేసులోని సాక్షులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని సునీత ఆరోపించారు.

మా నాన్న కేసులో సాక్షులు

మళ్లీ సీబీఐ విచారణ మొదలు

నాన్న హత్యకు ఇప్పటి వరకూ న్యాయం జరగలేదు. నిందితుల కంటే మేమే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామన్నారు. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని, సీబీఐ మళ్లీ విచారణ మొదలుపెడుతుందని ఆశిస్తున్నా అంటూ వైఎస్ సునీతా రెడ్డి తెలిపారు. దీనిపై ఏపీ సర్కార్‌ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి. ఈ సందర్భంగా పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో సునీత మాట్లాడారు.

టీడీపీపై ఆరోపణలు

కాగా, 2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకా హత్య జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. టీడీపీపై ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎం అయ్యాక.. వివేకా హత్య కేసును జగన్ అంతగా పట్టించుకోలేదు. వివేకా హత్య కేసుపై నాటి జగన్ సర్కారు ఫోకస్ చేయకపోవడంతో వివేకా కుమార్తె సునీతకు అనుమానం వచ్చింది. వైఎస్ సునీతారెడ్డి సీబీఐ విచారణను డిమాండ్ చేశారు. దీనికి ఏపీ హైకోర్టు అంగీకారం తెలిపింది. అప్పటి నుంచి సీబీఐ విచారణ జరుగుతోంది. సీబీఐ విచారణ మొదలయ్యాకే.. వివేకాది గుండెపోటు కాదని హత్య అని తేలింది.

Related Posts
మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు
మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి: తండ్రి ఆనందం, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్టులో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్

మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి: తండ్రి ఆనందం మెల్బోర్న్‌లో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్టులో భారత ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి Read more

ఎన్నికల సంఘంపై మండిపడ్డ కాంగ్రెస్
ఎన్నికల సంఘంపై మండిపడ్డ కాంగ్రెస్

ఎన్నికల సంఘంపై మండిపడ్డ కాంగ్రెస్, పారదర్శకత తగ్గిపోవడం పై తీవ్ర విమర్శలు భారత ప్రభుత్వం కొన్ని ఎన్నికల నియమాలలో మార్పులు చేర్చింది, దీనివల్ల పబ్లిక్‌కు కొన్ని ఎలక్ట్రానిక్ Read more

జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
Terror attack on Army vehicle in Jammu and Kashmir

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులు భయాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రదేశంలో ఉగ్రవాదులు ఇటు ఇటుగా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఖ్నూర్‌ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై Read more

ఏపీకి 5 సంస్థలు :మంత్రి సవిత
ఏపీకి 5 సంస్థలు :మంత్రి సవిత

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సంబంధించి ప్రముఖమైన ఐదు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సంస్థలు రూ.2 వేల కోట్ల పెట్టుబడులు చేనేత రంగంలో పెట్టడానికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *