ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో, హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా సైరన్లు మోగాయి. ఇది చూసినవారంతా ఆశ్చర్యపోయారు. చాలా మందిలో భయాందోళన మొదలైంది. కానీ ఇది మాక్డ్రిల్ మాత్రమే.పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా స్పందించారు. “ఇది కేంద్రం ఆదేశాల మేరకు నిర్వహించిన మాక్డ్రిల్,” అని స్పష్టం చేశారు.ప్రజల్లో విపత్తులపై అవగాహన పెంచడమే లక్ష్యం. అలాగే శాఖల మధ్య సమన్వయం ఎలా ఉందో పరీక్షించడానికీ ఇది చేపట్టారు.“ఒకేసారి పారిశ్రామిక సైరన్లు, పోలీస్ వాహనాలు, పెట్రోల్ బంకుల సైరన్లు మోగాయి,” అని ఆనంద్ వివరించారు.అప్పటికి అప్పుడే కమాండ్ సెంటర్ నుంచి సురక్షితంగా ఉండండి అని సూచనలు వచ్చాయి.నగరంలోని నాలుగు ప్రాంతాల్లో వైమానిక దాడుల మాదిరిగా భావించి ఇది ప్రాక్టీస్ చేశారు.

పోలీస్, GHMC, రెవెన్యూ, విద్యుత్, ట్రాన్స్పోర్ట్ తదితర ప్రధాన శాఖలు వెంటనే స్పందించాయి.ఫైర్ ఇంజిన్లు, అంబులెన్సులు సంఘటనా స్థలాలకు వేగంగా చేరుకున్నాయి. ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానెల్ సెట్ చేశారు.కృత్రిమంగా గాయపడిన బాధితులను స్ట్రెచర్లపై ఆసుపత్రులకు తరలించారు.మంటల్ని అదుపు చేయడం, ప్రథమ చికిత్స అందించడం వంటి అంశాలు ప్రదర్శించారు.వైద్య సిబ్బంది స్పందన కూడా పట్టణ స్థాయి లోనే కనిపించింది.”ఈ డ్రిల్ వల్ల కొన్ని లోపాలూ వెలుగులోకి వచ్చాయి,” అని సీపీ చెప్పారు.అన్ని శాఖల అధికారులతో త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.”ఈ లోపాల్ని సరిచేసి మరింత మెరుగైన ప్రణాళికలు తీసుకుంటాం,” అని చెప్పారు.”ఇది కేవలం ప్రజల అప్రమత్తత కోసం సాధన మాత్రమే,” అని స్పష్టం చేశారు.ఏవైనా సందేహాలుంటే 112కి కాల్ చేయండి, భయపడాల్సిన పని లేదన్నారు.
Read Also : Chiranjeevi : ‘జై హింద్’ అని ట్వీట్ చేసిన చిరంజీవి