రాజస్థాన్లోని పర్యాటక నగరం ఉదయపూర్లో (udaipur) జరిగిన ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న మహిళను బర్త్డే పార్టీకి ఆహ్వానించి, మద్యం తాగించి, అదే సంస్థకు చెందిన సీఈఓతో పాటు మరో ఇద్దరు సహోద్యోగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రక్షణ ఇవ్వాల్సిన యజమానే నేరస్తుడిగా మారడం మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలకు ఎదురవుతున్న మానసిక, శారీరక ప్రమాదాలను మరోసారి బహిర్గతం చేసింది.
Read also: Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

Udaipur
మార్గమధ్యంలో ఆమెకు మత్తు పదార్థం బలవంతంగా ఇచ్చి
పోలీసుల వివరాల ప్రకారం, డిసెంబర్ 20న కంపెనీ సీఈఓ పుట్టినరోజు, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఓ హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారు. రాత్రి వేడుకలు ముగిశాక, మద్యం మత్తులో ఉన్న మేనేజర్ను ఇంటివద్ద దింపుతామని నమ్మించి కారులో తీసుకెళ్లారు. మార్గమధ్యంలో ఆమెకు మత్తు పదార్థం బలవంతంగా ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తరువాత కదులుతున్న కారులోనే సీఈఓ, మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తెల్లవారుజామున వరకు ఆమెను కారులో తిప్పుతూ ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. కారులో ఉన్న డాష్క్యామ్ ఫుటేజ్ కీలక సాక్ష్యంగా మారింది. వీడియో ఆధారాల ఆధారంగా పోలీసులు సీఈఓతో పాటు ఒక మహిళా ఉద్యోగిని, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. మహిళా నేరాల విభాగం ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. బాధితురాలి గోప్యతను కాపాడేందుకు ఆమె వివరాలను పోలీసులు పూర్తిగా రహస్యంగా ఉంచారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: