Tirupati: తిరుపతిలో కత్తులు,కర్రలతో సైకో వీరంగం : యాచకుడు మృతి

Read Time:  1 min
Tirupati: తిరుపతిలో కత్తులు,కర్రలతో సైకో వీరంగం : యాచకుడు మృతి
FONT SIZE
GET APP

తిరుపతి: నిత్యం యాత్రికులతో, భక్తులతో వాహనాలతో రద్దీగా ఉండే
తిరుపతి (Tirupati) లోని కపిలతీర్థం కూడలిలో సోమవారం ఉదయం ఓ మతిస్థిమితం లేని (40)వ్యక్తి (Insane person) కత్తులు, కర్రలతో వీరంగం చేశాడు. పుట్ పాత్, కపిలతీర్థంముందు రోడ్డుపై కూర్చునివున్న యాచకుల పై, కొందరు భక్తులపై దాడికి పాల్పడ్డాడు.

Tirupati: తిరుపతిలో కత్తులు,కర్రలతో సైకో వీరంగం : యాచకుడు మృతి
Tirupati: తిరుపతిలో కత్తులు,కర్రలతో సైకో వీరంగం : యాచకుడు మృతి

సైకో కత్తితో దాడి-యాచకుడు మృతి

చేతిలోని కత్తి, కర్రలు పట్టుకుని వీరంగంతో కనిపించిన వారిపై దాడిచేశాడు. కత్తితో దాడిచేయడంతో (Attack with a knife) అక్కడే ఉన్న యాచకుడు శేఖర్(55)తలకు బలమైన గాయాలయ్యాయి. మరో ముగ్గురు భక్తులు గాయపడ్డారు. స్థానికులు పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్, అలిపిరి పోలీసులు అక్కడకు చేరుకుని సైకోను వల సాయంతో అదుపులోకి తీసుకున్నారు, కనిపించిన వారందరిపై దాడిచేస్తూ భయంగొల్పించాడు. నగరవాసులు పరుగులుతీశారు. తీవ్రంగా గాయపడిన వారిని రుయాకు తరలించగా చికిత్సపొందుతూ శేఖర్ మృతి చెందాడు. మరో ఇద్దరు భక్తులు చికిత్సపొందుతున్నారు. సోమవారం కావడం, కపిలతీర్థం భక్తులతో రద్దీగా ఉంటుంది. సైకో వీరంగంతో అక్కడ ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సైకోను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకుని రుయా మానసిక వార్డులో చేర్చారు .

తిరుపతి వెనుక కథ ఏమిటి?

తిరుపతి బాలాజీ అవతారం వెనుక ఉన్న రహస్యం:

ఒక స్వర్గపు సంఘర్షణ కారణంగా, లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమికి దిగివచ్చింది . విష్ణువు ఆ వియోగాన్ని భరించలేకపోయాడు. కాబట్టి, అతను శ్రీనివాసుడిగా మారి భూమికి వచ్చాడు. తిరుమల కొండలలో ఆశ్రయం పొందాడు.

తిరుపతి 12 సంవత్సరాలు ఎందుకు మూసివేయబడింది?

12 మందిని ఉరితీసి చంపారు, మరియు వారి మృతదేహాలు తిరుపతి ఆలయ గోడలపై వేలాడదీయబడ్డాయి. ఆ సమయంలో దేవత కనిపించిందని మరియు తరువాత ఆలయం 12 సంవత్సరాలు మూసివేయబడిందని చాలా మంది చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Panchayat Secretaries: పంచాయతీ కార్యదర్శుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.