Tiruchanur Fake Liquor Case: తిరుపతి సమీపంలోని తిరుచానూరులో పోలీసులు ఒక వినూత్నమైన, ప్రమాదకరమైన నేరాన్ని ఛేదించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యూట్యూబ్ను వాడుకుని నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న ఓ వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టారు.
Read also: Gold rate today : బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్లో ఈరోజు రేట్లు ఇవే

యూట్యూబే గురువు.. ఒక్కో బాటిల్ రూ.300!
పోలీసుల కథనం ప్రకారం.. నగేష్ రెడ్డి అనే వ్యక్తి గత మూడు నెలలుగా తన నివాసంలోనే రహస్యంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి మద్యం తయారీ విధానాన్ని నేర్చుకున్నాడు. రసాయనాలు కలిపి తయారు చేసిన ఈ నకిలీ మద్యాన్ని ఒక్కో బాటిల్ రూ.300 చొప్పున విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు.
మూడు నెలల నుంచి దందా
నగేష్ రెడ్డి కార్యకలాపాలపై సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు దాడులు నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈజీ మనీ కోసమే ఈ పని చేస్తున్నట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మూడు నెలలుగా ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నకిలీ మద్యం తాగితే ప్రాణాపాయం ఉంటుందని, ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: