SBI ATM: కోఠి కాల్పుల ఘటనలో వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్

Read Time:  1 min
SBI ATM
SBI ATM
FONT SIZE
GET APP
SBI ATM

హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ(SBI ATM) ప్రధాన కార్యాలయానికి చెందిన ఏటీఎం వద్ద దుండగులు కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రషీద్ అనే వ్యక్తిని వెంబడించిన దుండగులు గన్‌తో కాల్చి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదును తీసుకుని పరారయ్యారు.

Read Also: Phone Tapping Case : ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

కాలికి బులెట్ గాయం – ఆస్పత్రిలో చికిత్స

ఈ ఘటనలో రషీద్‌కు కాలికి తూటా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

SBI ATM

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు

ఈ దోపిడీ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్(SBI ATM) తాజాగా బయటకు వచ్చింది. దృశ్యాల ఆధారంగా దుండగుల కదలికలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.