ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో(Noida) వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. MRI స్కాన్కు ముందు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చిన కారణంగా బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Read Also:Vizianagaram: కాశీయాత్ర నుంచి తిరిగి వస్తుండగా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి

సెక్టార్ P-3లోని KB హెల్త్కేర్ కేంద్రానికి గర్వ్ కసానా అనే బాలుడిని MRI పరీక్ష కోసం కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. అక్కడ చికిత్స ప్రక్రియలో భాగంగా సిబ్బంది మత్తు మందు అందించారు. అయితే కొద్దిసేపటికే బాలుడు పరిస్థితి విషమించి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
ఈ ఘటనకు(Noida) వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత కుటుంబానికి మద్దతుగా రైతు నాయకుడు పవన్ ఖతానా ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, ప్రజలు హెల్త్కేర్ సెంటర్ ముందు నిరసన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు సెక్టార్ P-3లోని KB హెల్త్కేర్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: