News Telugu: Murder – కూకట్‌పల్లి రేణు హత్య కేసులో వెలుగులో షాకింగ్ విషయాలు

Read Time:  1 min
Murder
Murder
FONT SIZE
GET APP

కూకట్‌పల్లి (Kukatpally) రేణు అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు హైదరాబాద్‌ నగరాన్ని కలచివేసిన రేణు అగర్వాల్ హత్యకేసులో ఒక్కొక్కటి బయటకు వస్తున్న వివరాలు మరింత షాకింగ్‌గా మారుతున్నాయి. కేవలం 20 ఏళ్ల వయసు గల హర్ష, రోషన్ అనే ఇద్దరు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. రేణు అగర్వాల్ (Renu Agarwal) శరీరంపై 20కి పైగా కత్తి గాయాలు ఉండటం హత్య ఎంత క్రూరంగా జరిగిందో చూపిస్తోంది. పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ వివరాల ప్రకారం, రేణు అగర్వాల్‌ను హత్య చేసిన హర్ష ఇంట్లో పని చేసేవాడు. అతనితో పాటు పక్కింట్లో పని చేసిన రోషన్ కూడా ఈ ఘటనలో పాల్గొన్నాడు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ ఇద్దరినే నిందితులుగా గుర్తించారు. లాకర్ వివరాలు చెప్పమని ఒత్తిడి చేయడంతో రేణును హర్ష చిత్రహింసలకు గురిచేసినట్లు బయటపడింది. అయితే కుటుంబ సభ్యుల ప్రకారం, ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారం ఏదీ లేకుండా, రేణు శరీరంపై ధరించిన ఆభరణాలనే తీసుకెళ్లారని తెలిపారు. అదనంగా 50 వేల రూపాయల నగదు, సుమారు ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Murder

Murder

కత్తెరతో రేణు గొంతుపై దాడి చేసి,

హత్య సమయంలో నిందితులు కత్తెరతో రేణు గొంతుపై దాడి చేసి, అనంతరం రెండు వేర్వేరు కత్తులతో దాడి చేసినట్లు తేలింది. ఘటన స్థలంలో రక్తపు మరకలతో ఉన్న బట్టలు, కత్తులు, కత్తెర, వంటసామాను లాంటి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్ష, రోషన్ ఇద్దరూ జార్ఖండ్‌కు చెందిన వారు. వీరు కూకట్‌పల్లి (kukatpally) లో గత కొద్ది కాలంగా పనిచేస్తూ, అక్కడే నివాసం ఉంటున్నారు. వారికి నెలకు రూ.15,000 జీతం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి (Ravi Kiran Reddy) మీడియాకు వివరాలు అందిస్తూ, “ఈ కేసు దర్యాప్తుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. నిందితులు జార్ఖండ్‌కు పరారై ఉండే అవకాశం ఉండటంతో ఒక బృందాన్ని అక్కడకు పంపించాం. కూకట్‌పల్లి నుంచి మాదాపూర్ (Madhapur) వైపు ద్విచక్రవాహనంపై వెళ్లినట్టు ఆధారాలు దొరికాయి. హర్ష రేణు ఇంట్లో 11 రోజుల పాటు పనిచేసి, పూర్తిగా నమ్మకం పొందాడు. వారిద్దరినీ కోల్‌కతాలో ఉన్న సెక్యూరిటీ ఏజెంట్ శంకర్ ద్వారా ఇక్కడ పనిలో పెట్టారు” అని తెలిపారు. రేణు అగర్వాల్ కుటుంబం మార్వాడీ వ్యాపార వర్గానికి చెందినది. ఆమె భర్త రాకేష్ అగర్వాల్ సనత్ నగర్‌లో స్టీల్ వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంతో ఇంట్లో డబ్బు ఎక్కువగా ఉంటుందని భావించి నిందితులు దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Q1. కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితులు ఎవరు?
A1. ఈ కేసులో ప్రధాన నిందితులు హర్ష, రోషన్ అనే ఇద్దరు యువకులు. వీరి వయసు సుమారు 20 సంవత్సరాలు.

Q2. మృతురాలి శరీరంపై ఎన్ని కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు?
A2. రేణు అగర్వాల్ శరీరంపై 20కి పైగా కత్తి గాయాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Q3. నిందితులు రేణు అగర్వాల్‌ను ఎలా హత్య చేశారు?

A3. మొదట రేణు గొంతులో కత్తెరతో పొడిచి, తర్వాత రెండు కత్తులతో దారుణంగా దాడి చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/shamshabad-marijuana-worth-rs-14-crore-seized-at-shamshabad-airport/hyderabad/545095/

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.