Madhya Pradesh Crime: మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఖాండ్వా జిల్లాలో జరిగిన ఈ అమానవీయ కృత్యం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోయారు. ఏకంగా 90 ఏళ్ల వృద్ధురాలి పై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఈ అమానవీయ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also: Kamareddy Crime: మిస్సింగ్ చిన్నారుల కేసు విషాదాంతం
ఆందోళనకరంగా వృద్ధురాలు ఆరోగ్య పరిస్థితి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాండ్వా జిల్లాలోని ఓ గ్రామంలో 90 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా ముఖాలకు ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న ఆ వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మేల్కొని వచ్చేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వృద్ధాప్యం కారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: