తమిళనాడులో (Tamil Nadu) మరోసారి సభ్యసమాజం తలదించుకునేలా చేసే ఘటన చోటుచేసుకుంది. భూవివాదం కారణంగా ఓ మహిళపై నలుగురు మహిళలు క్రూరంగా దాడి చేశారు. కడలూరు జిల్లా పన్రుటి సమీపంలోని గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాధితురాలిని చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, పాక్షికంగా వివస్త్రం చేసి తీవ్రంగా అవమానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలి కుటుంబానికి నిందితుల కుటుంబంతో భూవివాదం గత కొంతకాలంగా కొనసాగుతోంది. ఆ కక్షతోనే నలుగురు మహిళలు కలసి బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను బయటికి లాగి చెట్టుకు కట్టేశారు. అనంతరం చితకబాదడంతో పాటు మాటలతోనూ అవమానించారు.
దాడి తీవ్రతతో బాధితురాలు మానసికంగా తీవ్ర వేదనకు గురైనట్లు తెలిసింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులలో ఒక మహిళను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలను (Special teams) ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. “ప్రాథమిక విచారణలో భూవివాదమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. కులం కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం” అని ఆయన వివరించారు.
దాడి తీవ్రరూపం దాల్చడంతో మధ్యలో మరో మహిళ
సోషల్ మీడియాలో వైరల్ అయిన 2.13 నిమిషాల నిడివి గల వీడియోలో అత్యంత దారుణమైన దృశ్యాలు ఉన్నాయి. బాధితురాలిని ఆమె చీరతోనే చెట్టుకు కట్టేసి, నలుగురు మహిళలు చుట్టుముట్టారు. ఒకరు కర్రతో కొడుతుండగా, మరొకరు ఆమె జుట్టు పట్టుకుని లాగుతూ దూషించారు. “నువ్వు ఓ కుక్కతో సమానం” అంటూ దారుణంగా మాట్లాడారు. ఆమె బ్లౌజ్ను పాక్షికంగా తొలగించి అవమానించే ప్రయత్నం చేశారు.
బాధితురాలు వారి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించడం వీడియోలో కనిపించింది.ఆశ్చర్యకరంగా, అక్కడే ఉన్న మరో మహిళ ఈ దాడినంతా వీడియో తీస్తుండగా, “మీరంతా జైలుకు వెళ్తారు” అని హెచ్చరించినా నిందితులు ఏమాత్రం లెక్కచేయలేదు. దాడి తీవ్రరూపం దాల్చడంతో మధ్యలో మరో మహిళ కల్పించుకుని వారిని ఆపేందుకు ప్రయత్నించడం కూడా వీడియోలో రికార్డయింది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర కలకలం రేగగా, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: