हिन्दी | Epaper

Kanchipuram: పిల్లలని హతహమార్చిన తల్లి, ప్రియుడికి జీవిత ఖైదు

Sharanya
Kanchipuram: పిల్లలని హతహమార్చిన తల్లి, ప్రియుడికి జీవిత ఖైదు

తమిళనాడులోని కాంచీపురం (Kanchipuram) జిల్లాలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన హృదయవిదారక సంఘటనకు గురువారం న్యాయస్థానం ముగింపు పలికింది. తమ పిల్లలు వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నారన్న కారణంతో, తల్లి అభిరామి మరియు ఆమె ప్రియుడు మీనాక్షిసుందరం కలిసి ఇద్దరు పిల్లలను హత్య చేసిన కేసులో కోర్టు నిందితులకు జీవితాంత శిక్ష (Life imprisonment for the accused) విధించింది.

బలమైన బంధాన్ని చించేసిన నీచత్వం

కాంచీపురం (Kanchipuram) జిల్లాలోని మూడ్రాంకట్టలైకి చెందిన విజయ్-అభిరామి దంపతులకు 7 ఏళ్ల అజయ్, 4 ఏళ్ల కర్ణిక అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. విజయ్ ఏటీఎంలలో నగదు పంపిణీ ఉద్యోగిగా పని చేస్తుండగా, అభిరామికి సమీపంలోని బిర్యానీ హోటల్ యజమాని మీనాక్షిసుందరంతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమేణా వివాహేతర సంబంధంగా మారింది.

అడ్డుగా ఉన్నారని పిల్లలను హత్య చేసిన దారుణం

తమ బంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించిన అభిరామి, మీనాక్షిసుందరంతో కలిసి వారికి పాలలో మత్తుమాత్రలు కలిపి హత్య చేశారు (Murdered together). ఈ దారుణం 2018లో వెలుగుచూసి, అప్పట్లో తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉద్రేకానికి కారణమైంది.

నేరాన్ని ఛేదించిన పోలీసులు, కేసు విచారణ

ఈ కేసును చెన్నై కోయంబేడు పోలీసులు దర్యాప్తు చేసి, అభిరామి, మీనాక్షిసుందరంలను అరెస్టు చేశారు. మొదట చెంగల్పట్టు మహిళా కోర్టులో విచారణ మొదలై, అనంతరం కేసు కాంచీపురం మహిళా కోర్టుకు బదిలీ చేయబడింది.

కోర్టు తీర్పు: జీవితాంత శిక్ష

విచారణ పూర్తైన తరువాత, కోర్టు నేరాన్ని రుజువుగా గుర్తించింది. న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ, “ఇది అత్యంత పాశవికమైన నేరం. పసికందులను హత్య చేయడం మానవత్వానికి విరుద్ధం. నిందితులు మరణించే వరకూ జైల్లో ఉండాల్సిందే,” అంటూ ఇద్దరికీ మరణం వరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Rajasthan: రాజస్థాన్ లో విషాదం.. పైకప్పు కూలి ఐదుగురు చిన్నారులు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870