Latest News: Kadapa Crime: రోకలి బండతో వృద్ధ జంటను హత్య చేసిన దుండగులు

Read Time:  1 min
Kadapa Crime
Kadapa Crime
FONT SIZE
GET APP

కడప (Kadapa) జిల్లా మోరగుడి సమీపంలో ఒక వృద్ధ జంటను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చిన ఘటనా చోటు, స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాగప్ప(60), ఓబులమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, నాగప్ప గత ముప్పై సంవత్సరాలుగా పెద్దక్క అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

Read Also: Louvre Museum: లావ్రే మ్యూజియంలో ఇటీవల భారీ చోరీ

Kadapa Crime
Kadapa Crime

దీనికి ఓబులమ్మ ఆమోదం కూడా ఉన్నట్లు సమాచారం.పిల్లలతో కలిసి ఓబులమ్మ జమ్మలమడుగులో నివాసం ఉంటున్నారు. నాగప్ప, పెద్దక్క తాడిపత్రి (Tadipatri) లో రహదారిలోని ఇటుకల బట్టీ నడుపుతూ అక్కడే ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇటుకల బట్టీ వద్ద నిర్మించుకున్న గదిలో నిద్రిస్తున్న నాగప్ప, పెద్దక్కలను దుండగులు రోకలి బండతో తలలు పగలగొట్టి హతమార్చారు.

పక్క గదిలోని బీరువాలో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యలు దోపిడీదొంగల పనా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.