Hyderabad crime: ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్న ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ అనే యువతి మృతి చెందింది.
Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మహిళా టెకీ మృతి

ప్రేమ వ్యవహారంలో మనస్తాపం
పూజ అదే గ్రామానికి చెందిన సిద్ధగోని మహేష్తో కొంతకాలంగా పరిచయం ఉండటంతో పాటు ప్రేమ సంబంధం కొనసాగింది. ఈ విషయం పూజ కుటుంబసభ్యులకు తెలియడంతో వారు తీవ్రంగా మందలించారు. కుటుంబ ఒత్తిడి(stress) కారణంగా పూజ మహేష్కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. అయితే, తనను వివాహం చేసుకోవాలని కోరుతూ మహేష్ ఫోన్ ద్వారా పూజపై ఒత్తిడి పెంచినట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లి విషయంలో బెదిరింపులకు గురైన పూజ తీవ్ర మానసిక వేదనకు లోనై, కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. యువతి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: