
పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇందుకోసం లక్షలు ఖర్చుపెడతారు. అమ్మానాన్న వారికి ఉజ్వల భవితను అందించేందుకు రాత్రీపగలు కష్టపడి పనిచేస్తారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఫీజుల రూపంలో వేలు ఖర్చుచేస్తారు. ఇవన్నీ పిల్లలపై తెలియని భారాన్ని మోపుతున్నాం. ఒకవైపు స్కూళ్లకు పోటీ. ర్యాంకులతో తమ విద్యాసంస్థలను వృద్ధి చేసుకోవాలనే తపనతో స్కూలు యాజమాన్యం పిల్లలపై ఒత్తిడిని తెస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఇటీవల విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలకు(Hyd Crime) పాల్పడుతున్నారు.
Read Also:Madhya Pradesh:సివిల్ హాస్పిటల్లో దారుణం..టాయిలెట్లో శిశువు మృతదేహం
మైనర్ బాలుడు ఆత్మహత్య(Hyd Crime) చందానగర్ పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో తన స్కూలు ఐడీకార్డు ట్యాగ్ తో బాత్ రూంలో ఓ బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రశాంత్ అనే బాలుడు బాత్ రూమ్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంత చిన్నవయసులో ఆ బాలుడికి ఏం కష్టం వచ్చిందో, ఎవరు ఏమన్నారో తెలియదు. చదువు ఒత్తిడినా.. లేక మరో కారణమా అనేది తెలియదు. అసలు ఇంత చిన్నవయసులో ఇలాంటి ఆలోచనలు వీరికి ఎందుకు కలుగుతున్నాయి? చనిపోవాలనే తలంపు వచ్చేంత కష్టం వీరికేం ఉంటుంది? తల్లిదండ్రులు ఆవేదన ఎంతగా ఉంటుందో గ్రహించేస్థితిలో ఉండరు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: