हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Extramarital Affair : నాందేడ్ జిల్లాలో వివాహేతర సంబంధం ఎక్కడికి దారితీసిందో తెలుసా..?

Sudheer
Extramarital Affair : నాందేడ్ జిల్లాలో వివాహేతర సంబంధం ఎక్కడికి దారితీసిందో తెలుసా..?

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా(Nanded District)లో ఓ భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. వివాహిత మహిళ తన ప్రియుడితో కలిసినందుకు, కుటుంబ సభ్యులే ఇద్దరినీ దారుణంగా హత్య చేసిన ఘటన బయటపడింది. ఆగస్టు 25న గోలేగావ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మహిళ ప్రియుడు ఆమెను కలవడానికి అత్తింటికి వచ్చాడు. ఈ సమయంలో అనుచిత పరిస్థితుల్లో వారిని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే మహిళ తండ్రికి సమాచారం అందించగా, తండ్రి, భర్తతో పాటు మరికొందరు వారిపై దాడి చేశారు. విచక్షణ లేకుండా కొట్టడంతో మహిళ సంజీవనీ, ఆమె ప్రియుడు లఖన్ భండారే అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం వారి శవాలను బావిలో పడేశారు. ఈ కేసులో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మురాదాబాద్‌లో భార్యను హత్య చేసిన భర్త

ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్ జిల్లాలో మరో భయంకర ఘటన చోటు చేసుకుంది. ఆరీఖెరా గ్రామానికి చెందిన నిషా అనే మహిళ మృతదేహం ఆగస్టు 24న ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. మొదట ఇది ఆత్మహత్యగా భావించినప్పటికీ, మూడు సంవత్సరాల చిన్నారి వాంగ్మూలం ఈ కేసులో సంచలనం రేపింది. చిన్నారి సాధ్వి ప్రకారం, తన తండ్రే ముందుగా డండాతో తల్లిని కొట్టి, ఆపై ఫ్యాన్‌కు ఉరివేశాడని తెలిపింది. మృతురాలి కుటుంబ సభ్యులు కూడా ఆమె భర్త అరవింద్ మద్యం అలవాటుతో తరచూ హింసించేవాడని, హత్య చేసిన వాడని ఆరోపించారు.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది

ఈ రెండు ఘటనలు ప్రాంతాల్లో కలకలం రేపాయి. నాందేడ్ కేసులో స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి, శవాలను బావి నుంచి వెలికి తీశారు. మురాదాబాద్ ఘటనలో మాత్రం భర్త వేరే కథ చెబుతూ తన నిర్దోషిత్వాన్ని వాదిస్తున్నాడు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్పీ (క్రైమ్) సుభాష్ చంద్ర గంగ్వార్ తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని, చిన్నారి వాంగ్మూలాన్ని కూడా సీరియస్‌గా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. ఇరు ఘటనలు కుటుంబ వ్యవహారాల పేరుతో అమానుష హత్యలకు ఉదాహరణగా నిలుస్తూ, సమాజాన్ని కలవరపెడుతున్నాయి.

https://vaartha.com/drug-racket-at-mahindra-university/breaking-news/536553/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870