Delhi student suicide : ఢిల్లీ సెయింట్ కొలంబాస్ స్కూల్కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి షౌర్య పటిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్ద దుమారం రేపుతోంది. మంగళవారం రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ నుండి దూకి ప్రాణాలు తీసుకున్న ఈ విద్యార్థి వదిలిన సుసైడ్ నోట్లో తనపై స్కూల్ టీచర్లు చేసిన ప్రవర్తనను ప్రస్తావించడంతో, స్కూల్ యాజమాన్యం హెడ్మాస్టర్తో పాటు ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ సమయంలో వారు స్కూల్కి రావడం, విద్యార్థులు లేదా తల్లిదండ్రులతో మాట్లాడడం పూర్తిగా నిషేధించబడింది.
షౌర్య తల్లిదండ్రులు స్కూల్ ముందు నిరసనకు సిద్ధమవుతున్నారు. వారి మాటల్లో, స్కూల్ అధికారులు కేవలం సస్పెన్షన్ వరకే పరిమితం అయ్యారని, పరిస్థితి చల్లబడిన తరువాత మళ్లీ తిరిగి చేర్చే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. బాలుడు వదిలిన నోట్లో తన తల్లికి క్షమాపణ చెప్పుతూ, స్కూల్ టీచర్ల ప్రవర్తనను ప్రస్తావించాడు.
Read Also: Hyderabad : గ్లోబల్ హబ్గా హైదరాబాద్
FIRలో షౌర్య తండ్రి ప్రదీప్ పటిల్ హెడ్మాస్టర్ అపరాజితా పాల్ మరియు మూడు గురు టీచర్లు జూలీ వర్గీస్, మనూ కళ్రా, యుక్తి అగర్వాల్ మహాజన్లను నిందించారు. సుసైడ్కు ముందు రోజుల నుంచే అతనిపై తీవ్రమైన ఒత్తిడి, దూషణలు, చిన్న విషయాలకే మందలింపులు, స్కూల్ నుండి బయటకు వేస్తామని బెదిరింపులు చేసినట్లు వెల్లడించారు. డ్రామాటిక్స్ క్లాస్లో పడిపోయినప్పుడు కూడా అవమానాలు ఎదుర్కొన్నట్టు, అక్కడే తీవ్రంగా ఏడుస్తుండగా టీచర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్టు తెలిపారు. ఇంత జరుగుతున్నప్పటికీ హెడ్మాస్టర్ ఏమాత్రం స్పందించలేదని తండ్రి ఆరోపించారు.
NDTVతో మాట్లాడిన ప్రదీప్ పటిల్, టీచర్లు అతన్ని నిరంతరం బాధపెట్టేవారని, సందర్భంగా పది రోజుల్లో జరగబోయే ప్రీ-బోర్డ్ పరీక్షలకు ముందు విద్యార్థిని స్కూల్ నుండి తొలగిస్తామని చెప్పడం ఊహించలేనిదని పేర్కొన్నారు. (Delhi student suicide) షౌర్య చిన్నప్పటి నుండి ఇదే స్కూల్లో చదువుతున్నాడని, తరచూ టీచర్ల వేధింపుల గురించి చెప్పేవాడని, మరో స్కూల్కి మార్చాలని నిర్ణయించినప్పటికీ, స్కూల్ కౌన్సిలర్కు సుసైడ్ ఆలోచనలు వచ్చినట్టు చెప్పిన విషయాన్ని స్కూల్ తమకు తెలియజేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, స్కూల్ ప్రిన్సిపాల్ రాబర్ట్ ఫెర్నాండెజ్ సస్పెన్షన్ లేఖలు జారీ చేస్తూ, విచారణ పూర్తయ్యే వరకు వారు అధికారిక అనుమతి లేకుండా స్కూల్ పరిసరాలకు రావద్దని ఆదేశించారు. FIR నమోదైన నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం తదుపరి ఆదేశాల వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం కూడా స్పందించింది. విద్యాశాఖ ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, స్కూల్ పరిపాలనా బాధ్యతలు, తప్పులపై సమగ్ర దర్యాప్తు జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సంయుక్త డైరెక్టర్ హర్షిత్ జైన్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :