దేశ రాజధాని ఢిల్లీలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. తన తల్లిపైనే ఒక క్రూర కుమారుడు అత్యాచారం చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ దారుణానికి పాల్పడిన 39 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కుటుంబ నేపథ్యం
పోలీసుల సమాచారం ప్రకారం, బాధితురాలు (65) ఢిల్లీ (Delhi) లోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో తన భర్త, కుమారుడు (నిందితుడు), 25 ఏళ్ల చిన్న కూతురుతో కలిసి నివసిస్తోంది. ఇటీవల ఈ కుటుంబం సౌదీ అరేబియాకు పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లింది. వారు అక్కడ ఉన్నప్పుడే నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి, వెంటనే తిరిగి రావాలని ఒత్తిడి చేయడమే కాకుండా, తన తల్లికి విడాకులు ఇవ్వాలని కోరాడు. చిన్నప్పటి నుంచే తల్లికి ఇతర సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అసహనం వ్యక్తం చేశాడు.
తల్లిపై పైశాచికం
ఈ నెల 1న కుటుంబం తిరిగి ఢిల్లీకి వచ్చిన తర్వాత నిందితుడి దారుణం మొదలైంది. తన తల్లిని ఒక గదిలో బంధించి, బలవంతంగా బుర్ఖా తొలగింపజేసి అత్యాచారానికి పాల్పడ్డాడు (Committed rape). ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె పెద్ద కుమార్తె ఇంట్లో ఆశ్రయం పొందింది. ఆగస్టు 11న బాధితురాలు తిరిగి తన ఇంటికి వచ్చినా, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆగస్టు 14న తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మరోసారి తల్లిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. తన తల్లికి గతంలో ఉన్న సంబంధాలకే ఇది శిక్ష అని చెప్పి మళ్లీ అమానుషానికి పాల్పడ్డాడు.
ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు
ఇక భరించలేని స్థితిలో ఉన్న ఆ తల్లి తన చిన్న కుమార్తెకు జరిగిన విషయాలను తెలిపింది. ఆమె ఇచ్చిన ధైర్యంతో ఇద్దరూ కలిసి హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు – నిందితుడు అరెస్టు
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ల 64 (అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘోర సంఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: