हिन्दी | Epaper

Chengicherla: బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి బాలికపై ముగ్గురి అత్యాచారం

Pooja
Chengicherla: బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి బాలికపై ముగ్గురి అత్యాచారం

Chengicherla: హైదరాబాద్ చెంగిచెర్ల ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం బాలికను అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లిన నిందితులు ఆమెకు మత్తు మందులు కలిపిన ఆహారం ఇచ్చి లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: POCSO: విశాఖలో ఘోరం: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

Chengicherla
Chengicherla: Three men rape girl after mixing sleeping pills in biryani

తరువాత ఆమెకు మద్యం ఇచ్చి మరొసారి దాడి చేసినట్లు సమాచారం. బాలికను బెదిరించి భయపెట్టి కొన్ని గంటల పాటు నిర్బంధంలో ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో మైనర్ నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870