husband wife murder suicide: జయశంకర్ భూపాలపల్లి(Bhupalapally Crime) జిల్లాలో కలచివేసే కుటుంబ విషాదం చోటుచేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో భర్త భార్యను హత్య చేసిన అనంతరం తానే ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
Read Also: Bapatla Crime: పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో, ముగ్గురు మృతి

వేధింపుల ఆరోపణల మధ్య భూపాలపల్లి ఘటన..
గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) తన భార్య సంధ్య (42)ను తాడుతో ఉరివేసి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అదే విధంగా ఉరివేసుకుని రామాచారి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు ముందు అతడు ఒక వీడియోను రికార్డు చేసి తన మొబైల్లో ఉంచినట్లు తెలిసింది. భార్య, కూతురు నుంచి ఎదురైన వేధింపులు(Harassment) భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ వీడియోలో పేర్కొన్నట్టు సమాచారం.
స్థానికుల కథనం ప్రకారం, రామాచారికి ఇది రెండో వివాహం. మొదటి భార్య మరణం అనంతరం సంధ్యను వివాహం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :