పిల్లల్ని చంపి తల్లిదండ్రుల ఆత్మహత్య – హబ్సిగూడలో విషాదం!

పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్ హబ్సిగూడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవ్వడంతో పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు పిల్లల్ని హత్య చేసి, అనంతరం ఉరేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ విషాదకర సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Crime.jpg

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మొకురాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, కవిత దంపతులు హబ్సిగూడలో నివాసముంటున్నారు. చంద్రశేఖర్ ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. అయితే గత ఆరు నెలలుగా ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఈ పరిస్థితులు భరించలేకనే పిల్లలైన శ్రిత రెడ్డి (9వ తరగతి), విశ్వాన్ రెడ్డి (5వ తరగతి)ను హత్య చేసి, తర్వాత భార్యతో కలిసి ఉరి వేసుకుని మరణించారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సూసైడ్‌ నోట్‌

పోలీసులు ఘటనాస్థలంలో దర్యాప్తు నిర్వహించగా, ఇంట్లో రెండు సూసైడ్‌ నోట్లు లభించాయి. అందులో ఆర్థిక ఇబ్బందులే తమ బలవన్మరణానికి కారణమని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గత నెల 21న కూడా వారు చనిపోవాలని భావించారని, కానీ ఆ రోజు ఆలోచన మార్చుకుని మళ్లీ జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించారని లేఖలో వివరించారు. అయితే, చివరకు ఈ నిర్ణయమే తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, చంద్రశేఖర్‌ రెడ్డి మొదటగా తన ఇద్దరు పిల్లలకు నిద్ర మాత్రలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత గొంతునులిమి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం భయంకరమైన ఈ చర్యను ముగించుకుని దంపతులు చెరో గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీతా రెడ్డి అబిడ్స్‌లోని ఫిట్జ్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. ఆమె చదువులో ప్రతిభావంతురాలిగా పేరుంది. విశ్వాన్ రెడ్డి జాన్సన్ స్కూల్‌లో 5వ తరగతి విద్యార్థి. అతడూ చదువులో మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నాడు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న చంద్రశేఖర్‌ రెడ్డి, కవిత కుటుంబ సభ్యులు హబ్సిగూడకు చేరుకున్నారు. నలుగురిని చనిపోయిన స్థితిలో చూసి తట్టుకోలేక విలపించారు. కుటుంబంలోని పెద్దలు, బంధువులు, ఇరుగుపొరుగువారు కన్నీటి పర్యంతమయ్యారు. హబ్సిగూడ ప్రాంత ప్రజలు కూడా ఈ దారుణ ఘటన గురించి విని తీవ్ర దిగ్బంధతకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబానికి అప్పుల బాధ ఉన్నట్లు, ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఆర్థిక ఒత్తిడి పెరిగిందని పోలీసుల అనుమానం. గతంలోనూ వారు ఇలాంటి ఆలోచనలు చేసినట్లు సూసైడ్‌ నోట్‌లో పొందుపరిచిన మాటల ద్వారా తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం హైదరాబాద్ లో కలకలం రేపింది.

Related Posts
నదిలో కుప్పకూలిన వంతెన..! దీన్ని ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
150 year old bridge on gang

కాన్పూర్‌లోని గంగా నదిపై 150 సంవత్సరాల వయస్సున్న ప్రాచీన వంతెన ఇటీవల కూలిపోయింది. ఈ వంతెన స్వాతంత్ర్య సమర యుగంలోనూ, బ్రిటీష్ కాలంలోనూ చారిత్రక ప్రాధాన్యతను కలిగి Read more

సచివాలయంలో హ్యామ్ రోడ్లపై ఆర్ & బీ అధికారులతో జరిగిన రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
WhatsApp Image 2025 02 05 at 17.26.53 bec2c29b

ప్రెస్ నోట్-05.02.2025 సచివాలయంలో హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటీ మోడ్) రోడ్లపై ఆర్ & బీ అధికారులతో జరిగిన రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ రాష్ట్రంలో Read more

సొంత పార్టీపైనే విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్
dharmapuri

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన సొంత పార్టీ బిజెపి పైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ Read more

హాల్ టిక్కెట్ లేకున్నా పరీక్షలకు అనుమతించాలి: తెలంగాణ ఇంటర్ బోర్డు
intermediate exams

హాల్ టిక్కెట్ లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు ప్రకటించింది. తెలంగాణలో ఇంటర్ హాల్ టిక్కెట్ల జారీలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సీజీజీ పోర్టల్‌లో సాంకేతిక Read more