Corbin Bosch పాకిస్థాన్‌ లీగ్‌లో ఆడేందుకు జల్మి జట్టుతో ఒప్పందం

Corbin Bosch : పాకిస్థాన్‌ లీగ్‌లో ఆడేందుకు జల్మి జట్టుతో ఒప్పందం

Corbin Bosch : పాకిస్థాన్‌ లీగ్‌లో ఆడేందుకు జల్మి జట్టుతో ఒప్పందం ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఆల్ రౌండర్ కార్బిన్ బోష్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా లీగల్ నోటీసులు జారీ చేసింది. అసలు కారణం ఏమిటంటే,మొదట పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడేందుకు అంగీకరించిన బోష్, తర్వాత అనూహ్యంగా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌తో ఒప్పందం చేసుకోవడం.దక్షిణాఫ్రికాకు చెందిన బోష్, ఈ ఏడాది పాకిస్థాన్ మీద తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

Corbin Bosch పాకిస్థాన్‌ లీగ్‌లో ఆడేందుకు జల్మి జట్టుతో ఒప్పందం
Corbin Bosch పాకిస్థాన్‌ లీగ్‌లో ఆడేందుకు జల్మి జట్టుతో ఒప్పందం

ఆ సిరీస్‌లో అదరగొట్టడంతో పీఎస్‌ఎల్ ఫ్రాంఛైజీ పెషావర్ జల్మీ అతడిని తమ జట్టులోకి తీసుకుంది.జనవరి 13న లాహోర్‌లో జరిగిన పీఎస్‌ఎల్ ప్లేయర్స్ డ్రాఫ్ట్ పదో ఎడిషన్ సందర్భంగా ఆ ఫ్రాంఛైజీ బోష్‌ను కొనుగోలు చేసింది.అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో,అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు బోష్‌ను ఎంపిక చేసింది.అయితే బోష్ ఇప్పటికే పీఎస్‌ఎల్ ఫ్రాంఛైజీతో ఒప్పందం చేసుకుని ముంబయి ఇండియన్స్‌కు మారడం పీసీబీకి ఆగ్రహాన్ని కలిగించింది.ఈ నేపథ్యంలో అతనికి లీగల్ నోటీసులు పంపింది. తన ఒప్పందాన్ని అతిక్రమించడంపై వివరణ ఇవ్వాలని కోరింది. పీఎస్‌ఎల్ 2016లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఐపీఎల్, పీఎస్‌ఎల్ ఒకేసారి జరగలేదు.కానీ ఈసారి మాత్రం రెండూ కొద్దీ రోజుల వ్యవధిలో జరుగుతున్నాయి.సాధారణంగా ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్ ముందుగా జరుగుతుంది.కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా పీఎస్‌ఎల్ ఆలస్యమైంది.ఐపీఎల్ ప్రారంభమైన రెండు వారాల తర్వాతే పీఎస్‌ఎల్ మొదలవుతుంది.

ఈ నేపథ్యంలోనే బోష్ ఐపీఎల్‌ను ప్రాధాన్యతనిస్తూ పీఎస్‌ఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అందుకే అతడిపై పీసీబీ నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 మిగిలిన ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది.ఈ నెల 22న మెగా టోర్నీకి శ్రీకారం చుట్టనున్నారు.తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనున్నాయి.

Related Posts
త్రిషకు తెలంగాణ సీఎం కోటి నజరానా.
India cricket player Gongadi Trisha with Telangana Chief Minikster Revanth Reddy

అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో తెలంగాణలోని భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష.. అటు బ్యాటింగ్‌లో,ఇటు బౌలింగ్‌లో సత్తా చాటింది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా నాలుగు Read more

Vijay Mallya: ఆర్సీబీ జట్టుకు అభినందనలు తెలిపిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్!
Vijay Mallya: ఆర్సీబీ జట్టుకు అభినందనలు తెలిపిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్!

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 2025 సీజన్ ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. 18వ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ Read more

సామ్ కాన్స్టాస్ కన్నీటి గాథ మీకు తెలుసా?
సామ్ కాన్స్టాస్ కన్నీటి గాథ మీకు తెలుసా?

'పింక్ టెస్ట్' క్యాన్సర్‌పై అవగాహన పెంచే ప్రత్యేక కార్యక్రమం ద్వారా సామ్ కాన్స్టాస్ తన కుటుంబ సభ్యుల మృతిని గుర్తు చేస్తూ, క్యాన్సర్‌తో పోరాటంలో మరింత నిధులు Read more

జమ్ము-కశ్మీర్‌తో రంజీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ
జమ్ము కశ్మీర్‌తో రంజీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ

రంజీ ట్రోఫీ ongoing మ్యాచ్‌లో జమ్మూ-కశ్మీర్ జట్టుతో జరుగుతున్న పోరులో ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు సాధించి తన ఫామ్‌ను కొంత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *