దేశంలో కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆదరణ!

దేశంలో కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆదరణ!

దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ తగ్గుతోందని ఓ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్‌.. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడిన విషయం తెలిసిందే. గెలుస్తుందనుకున్న రాష్ట్రాల్లో కూడా ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీంతో ఇక కాంగ్రెస్‌ పని అయిపోయిందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో ఓ సంస్థ చేపట్టిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
ఇప్పుడు ఎన్నికలు పెడితే …
గత ఎన్నికల్లో సెంచరీకి చేరువగా వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు పెడితే ఆ దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేదని తేలింది. 542 స్థానాలకు గానూ కేవలం 78కే పరిమితమయ్యే అవకాశం ఉందని ఇండియా టుడే, సీఓటర్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పోల్‌ లో వెల్లడైంది.

దేశంలో కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆదరణ!

ఎన్డీయేకు 300 పైచిలుకు సీట్లు

ఇక ఇదే సర్వేలో బీజేపీ కి ఆదరణ క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.. ఎన్డీయే కూటమి 300 పైచిలుకు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇందులో బీజేపీ సొంతంగా 281 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు దేశవ్యాప్తంగా 1,25,123 మందిని ప్రశ్నించి, వారి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపింది.

పని చేసిన అబ్ కి బార్ చార్ సౌ పార్ ..

2024 ఎన్నికల్లో ‘అబ్‌ కీ బార్‌.. 400 పార్‌’ అన్న నినాదంతో బీజేపీ ఊదరగొట్టిన విషయం తెలిసిందే. చివరికి 292 స్థానాల్లో మాత్రమే ఎన్డీయే గెలిచింది. అయితే, ఎన్నికలు పూర్తయిన ఆరు నెలల తర్వాత ప్రస్తుతం బీజేపీ గణనీయంగా పుంజుకుందని, ఎన్డీయే కూటమికి ప్రజాదరణ పెరిగిందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం బీజేపీ క్యాడర్‌లో జోష్ పెంచిందని తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి 343 సీట్లలో విజయ ఢంకా మోగిస్తుందని చెప్పింది. ఇక మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి (కాంగ్రెస్‌కు సొంతంగా 99) ప్రస్తుతం 188 సీట్లను దక్కించుకుంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా పెరుగుతుండగా కాంగ్రెస్ ప్రాభవం పడిపోతోందని పేర్కొంది.

Related Posts
‘స్వర్ణిమ’ పేరుతో మహిళలకు కొత్త పథకం తీసుకొచ్చిన మోడీ సర్కార్‌
Modi government has brought a new scheme for women named Swarnima

న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పథకాలను గతంలో కూడా Read more

Judges:జడ్జిలు తప్పు చేస్తే వారి పై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు..!
Judges:జడ్జిలు తప్పు చేస్తే వారి పై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు..!

ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో కరెన్సీ కట్టల కలకలం. ఆయన నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం కొత్త వివాదాలకు తెరలేపింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టపై దెబ్బ పడిందని, Read more

త్వరలో జాతీయ బీజేపీ అధ్యక్ష ఎన్నిక
త్వరలో జాతీయ బీజేపీ అధ్యక్ష ఎన్నిక

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో త్వరలో కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, 2020లో జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా Read more

IRCTC వెబ్‌సైట్‌లో భారీ అంతరాయం: ప్రయాణీకులకు ఇబ్బందులు
Indian railway

భారతదేశంలో, డిసెంబర్ 26న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్ (IRCTC) వెబ్‌సైట్ మరియు అప్లికేషన్‌లో భారీ అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ప్రయాణీకులు తమ Read more