Congress working committee meeting today.important discussions

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం..కీలక చర్చలు

న్యూఢిల్లీ: నేడు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరగనుంది. సమావేశానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు. హాజరుకానున్నారు. వీరితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, ఈవీఎంలపై చర్చ జరగనుంది.

Advertisements

ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి దామోదర్ రాజనరసింహ, చల్లా వంశీ చందర్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజులు హాజరు కానున్నారు.

కాగా, మహారాష్ట్ర , హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశాలు ఉన్నా పార్టీ ఓటిమికి గల కారణాలను విశ్లేషించనున్నారు. తప్పు ఎక్కడ జరిగింది, లోపాలను ఎలా సవరించుకోవాలనే అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొనాల్సిందిగా సోనియా, రాహుల్‌, ప్రియాంకతోపాటు ఇతర నేతలను ఆహ్వానించనున్నట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. 30న మహబూబ్‌నగర్‌లో జరిగే రైతు సదస్సులో పాల్గొననున్నారు. డిసెంబర్‌ 4న పెద్దపల్లి, 7న నల్లగొండ జిల్లాలకు వెళ్లనున్నారు.

Related Posts
సైనికుల పిల్లలకు యాభై శాతం స్కాలర్ షిప్ -మంచు విష్ణు
manchuvishnu

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు రిపబ్లిక్ డే సందర్భంగా సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే మంచి పనికి శ్రీకారం చుట్టాడు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల పిల్లల Read more

నేడు జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవం
నేడు జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవం

జనవరి 12న ప్రతి ఏడాది జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవం (National Pharmacist Day) జరుపుకుంటారు. ఈ ప్రత్యేక దినం ఫార్మసిస్ట్‌లను గౌరవించడానికి, వారి సేవలకు అభినందనలు తెలపడానికి Read more

పరువునష్టం కేసు.. విచారణకు హాజరైన కొండా సురేఖ
పరువునష్టం కేసు.. విచారణకు హాజరైన కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్.హైదరాబాద్‌ : హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరయ్యారు. Read more

2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు : ఐరాస
India population will be 170 crores by 2061 .

చైనా జనాభా 2021 నుంచి క్రమంగా తగ్గుముఖం న్యూయార్క్‌: ప్రపంచ జనాభా ధోరణులపై ఐక్యరాజ్య సమితి అంచనాలు విడుదల చేసింది. 2061 నాటికి భారత్‌ జనాభా 170 Read more

Advertisements
×