congress

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దీంతో అక్కడి రాజకీయ పార్టీలు అయిన ఆప్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు.. ప్రాంతీయ పార్టీలు కూడా ఓటర్లను ఆకర్షించుకునే పనిలో పడ్డారు. పోటీ చేసే రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారు. దీని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఓటర్లకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల బీజేపీ ఓటర్లను ఆకర్షించుకునేందుకు ఎన్నో వరాలను ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా కాంగ్రెస్ కూడా ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. ఐదు గ్యారెంటీలతో కొత్త మ్యానిఫెస్టోను విడుదల చేసింది. దీనిలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం ప్రకటించింది.

Advertisements

ప్రజలందరికీ ఆరోగ్యబీమా కల్పించడంలో భాగంగా.. అందరికీ ఆరోగ్యం పేరుతో పథకం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఢిల్లీలో కూడా.. మెహంగై ముక్తి యోజన పథకం ద్వారా రూ.500 లకే సిలిండర్ ను అందిస్తామన్నారు. వీటితో పాటు.. సీనియర్ సిటిజన్లకు ఉచితంగా రేషన్ కిట్స్, ట్రాన్స్‌జెండర్లు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేదలకు నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ కల్పిస్తామన్నారు. ఇక యువత కోసం నెలకు రూ.8500 స్టైఫండ్ అందిస్తామన్నారు. వీటిని ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఒక ఏడాది అప్రెంటీస్‌షిప్ ద్వారా ఈ స్టైఫండ్‌ అందించనున్నారు.

Related Posts
అస్సాం సర్కార్ పై సుప్రీం కోర్టు అగ్రహం
గవర్నర్‌కు వీటో అధికారాల్లేవ్: సుప్రీంకోర్టు

ప్రభుత్వాల పనితీరులపై సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా వాటి పనితీరులో మార్పులు వుండడం లేదు. దీనితో కోర్టుల ఆగ్రహానికి గురికావలిసి వస్తుంది. తాజాగా అస్సాం ప్రభుత్వ తీరుపై Read more

NarendraModi: క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటామన్న మోదీ..
NarendraModi: క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటామన్న మోదీ..

మయన్మార్‌లో చోటుచేసుకున్న భారీ భూకంపం అనంతరం, భారత ప్రభుత్వం "ఆపరేషన్ బ్రహ్మ" పేరిట సహాయ చర్యలను ప్రారంభించింది. విపత్తు సహాయక సామగ్రిని, అత్యవసర సేవలను అందించేందుకు భారత Read more

కష్టంతో న్యాయమూర్తి పదవీకి చేరుకున్న కొడుకు”: గుడ్ల వ్యాపారి తండ్రి విజయగాథ
judge

ఔరంగాబాద్ లో ఒక తండ్రి తన కొడుకును న్యాయమూర్తిగా ఉన్నత స్థాయిలో చూడాలని కలలు కన్నాడు . ఈ సంఘటన ఓ భావోద్వేగాన్ని కలిగించింది, ఎందుకంటే అతని Read more

Time’s Influential People: ప్రతిభావంతుల జాబితాలో భారతీయుడికి దక్కని చోటు
ప్రతిభావంతుల జాబితాలో భారతీయుడికి దక్కని చోటు

ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ప్రతీ సంవత్సరం విడుదల చేసే ‘టాప్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుఎన్షియల్ పీపుల్’ జాబితా 2025 సంవత్సరానికి విడుదలైంది. ఈ జాబితాలో ప్రపంచ Read more

×