हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

కొత్త రేషన్ కార్డులపై గందరగోళం

Sudheer
కొత్త రేషన్ కార్డులపై గందరగోళం

కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను గందరగోళానికి గురిచేశాయి. మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని పౌర సరఫరాల శాఖ మొదట లేఖ రాసినప్పటికీ, 24 గంటలు గడవక ముందే తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రజాపాలనలో అందుకున్న లిఖితపూర్వక దరఖాస్తుల పరిశీలనకే పరిమితం కానున్నట్లు స్పష్టం చేసింది.

ఈ క్రమంలో, శుక్రవారం రాత్రి మీ-సేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ఆప్షన్ కనిపించడంతో అనేక మంది శనివారం ఉదయం మీ-సేవ కేంద్రాలకు క్యూ కట్టారు. అయితే, ఆ ఆప్షన్ తొలగించడంతో దరఖాస్తుదారులు నిరాశ చెందారు. మీ-సేవ నిర్వాహకులు కూడా అనవసర గందరగోళానికి గురయ్యారు. ఈ అంశంపై అధికారులను ప్రశ్నించగా, ప్రజా పాలనలో అందుకున్న దరఖాస్తులనే ప్రాసెస్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మీ-సేవ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశమేనని, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తప్పుబాటుకు గురికాబట్టామని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులకు మీ-సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలియజేశారు.

దరఖాస్తుల స్వీకరణపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉందంటూ ప్రచారం జరిగింది. కానీ, ఎన్నికల సంఘం దీనిని ఖండించింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను నిలిపివేయాలంటూ ఎటువంటి ఆదేశాలు తమ నుంచి వెళ్లలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేయబడతాయని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజల్లో గందరగోళాన్ని నివారించేందుకు ప్రభుత్వం త్వరగా స్పష్టతనిస్తూ నిర్ణయాలు ప్రకటించాలని కోరుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870