Confiscation of Jayalalithaa assets in case of assets beyond her income

కళ్లు చెదిరే జయలలిత బంగారు ‘ఖజానా’!

10 వేల చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం సహా మరెన్నో ఆస్తులు

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని 6 ట్రంకు పెట్టెల్లో తీసుకువచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisements
కళ్లు చెదిరే జయ లలిత

న్యాయమూర్తి హెచ్‌ఎన్‌ మోహన్‌ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు. మరోవైపు తాము జయలలితకు వారసులమని, ఆ ఆస్తులను తమకే అప్పగించాలని జె.దీపక్, జె.దీప అనే వ్యక్తులు వేసుకున్న అర్జీని కర్ణాటక హైకోర్టు ఇదివరకే కొట్టివేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌నూ అక్కడి ధర్మాసనం తోసిపుచ్చింది. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువను 913.14 కోట్లుగా అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో ఆస్తులను కోర్టు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. ఈ విలువైన వస్తువులను స్వీకరించడానికి తమిళనాడు హోంశాఖ సంయుక్త కార్యదర్శి కోర్టుకు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రెజరీ అధికారులు ఆస్తులను జాగ్రత్తగా అప్పగించారు. ఆ ఆస్తులకు సంబంధించిన రికార్డులను నమోదు చేసే మొత్తం ప్రక్రియను తమిళనాడు అధికారులు వీడియో రికార్ఢింగ్ చేశారు. ఈ మొత్తం ప్రక్రియ ఒక మూసి ఉన్న గదిలో జరిగింది. చట్టపరమైన విధానాలను అనుసరించి విలువైన వస్తువులను అధికారికంగా తమిళనాడు అధికారులకు అప్పగించారు.

Related Posts
HCU : స్మితా సబర్వాల్కు నోటీసులు.. మంత్రి ఏమన్నారంటే?
smitha

తెలంగాణలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో IAS అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశమైంది. దీనిపై Read more

ఆయుష్మాన్ భారత్‌ ద్వారా క్యాన్సర్ చికిత్స
నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: ఆయుష్మాన్ భారత్‌ ద్వారా క్యాన్సర్ చికిత్స

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) జరుపుకుంటారు. ఈ రోజును యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ప్రారంభించింది. Read more

Tulsi Gabbard : భగవద్గీత నాకు బలాన్ని, శాంతిని ఇస్తుంది – తులసీ గబ్బార్డ్
tulsi gabbard

అమెరికా నిఘా సంస్థల డైరెక్టర్, రాజకీయ నాయకురాలు తులసీ గబ్బార్డ్ భగవద్గీతపై తన గాఢమైన భక్తిని వ్యక్తం చేశారు. భారత పర్యటనలో ఉన్న ఆమె ANI న్యూస్ Read more

Nityanandu: నిత్యానందు మరణించినట్లుగా ప్రకటించిన సోదరి కుమారుడు
నిత్యానందు మరణించినట్లుగా ప్రకటించిన సోదరి కుమారుడు

నిత్యానంద స్వామి: వివాదాలు, కైలాస దేశం మరియు అనేక ప్రశ్నలు నిత్యానంద స్వామి గురించి తెలివైనవారు మరియు ప్రజలు మాట్లాడకుండా ఉండటం కష్టం. ఈ స్వయంప్రకటిత ఆధ్యాత్మిక Read more

×