స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ

స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ

అమరావతి: 2014 -19 లో ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడింది. 2014-19 మధ్య జరిగినన్ని స్కాములు దేశంలో ఎక్కడా జరగలేదు. దేశంలోనే ఏపీ అవినీతిలో మొదటి స్థానంలో ఉందని జపాన్ కు చెందిన నేషనల్ కౌన్సిల్ నివేదిక ఇచ్చింది అని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. 2014-19 మధ్య జరిగిన అతిపెద్ద కుంభకోణం అమరావతి భూముల స్కామ్. అమరావతి కోసం 34వేల ఎకరాలు సేకరించారు. 1843 అసైన్డ్ భూములు ఆక్రమించారు. అమరావతి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుంభకోణం. అమరావతి కుంభకోణం పై ఎంక్వైరీ జరిగింది. మీకు చేతనైతే ఆ ఎంక్వైరీ బయటపెట్టండి.

Advertisements
స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ

అమరావతిలో తాత్కాలిక భవనాలకు 1150 కోట్లు

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో విచారణ జరిపించండి. విచారణకు సహకరించకుండా అప్పటి ముఖ్యమంత్రి పీఏని దేశం దాటిం చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు కొందరు మంత్రులు బినామీల పేరుతో వేలాది ఎకరాలు ఆక్రమించారు. అమరావతిలో తాత్కాలిక భవనాలకు 1150 కోట్లు ఖర్చు చేశారు. ఈ తాత్కాలిక భవనాల నిర్మాణంలో పెద్ద స్కామ్ జరిగింది. గట్టిగా వర్షం వస్తే ఈ ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది. పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాని చెప్పారు. ప్రధానితో ఆ మాట అనిపించుకోవడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా.. మీకు ధైర్యముంటే గత విచారణను బయటపెట్టి మాట్లాడండి అని వైసీపీ ఎమ్మెల్సీ కోరారు.

Related Posts
Nara Lokesh: ప్రైవేట్ వర్సిటీలను అడ్డుకున్న వైసీపీ: లోకేష్
Nara Lokesh: ప్రైవేట్ వర్సిటీలను అడ్డుకున్న వైసీపీ: లోకేష్

వాస్తవాలను అంగీకరించని వైసీపీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై వాస్తవాలను అంగీకరించే స్థితిలో వైసీపీ లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మండలిలో వైసీపీ Read more

ల‌తా ర‌జ‌నీకాంత్‌కు ప్రధాని మోడీ ఫోన్.. రజనీకాంత్‌ ఆరోగ్యంపై ఆరా..!
pm modi enquiries with wife latha about rajinikanth health

pm-modi-enquiries-with-wife-latha-about-rajinikanth-health న్యూఢిల్లీ: ద‌క్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. గుండెకు రక్తం Read more

ఎన్నికల్లో ఓటమికి కారణం అదే – జగన్
jagan mohan reddy 696x456

ప్రజల కోసం ఎంతో పని చేసినప్పటికీ తాము గెలవలేకపోవడం బాధ కలిగించింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ Read more

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి..కార్మికునికి త్రీవగాయాలు
Terrorist attack in Jammu and Kashmir.Worker injured

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో మరో ఉగ్ర దాడి జరిగింది. ఈసారి పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు కాశ్మీరేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక Read more

×