collector rajarshi shah to attend nagoba jatara darbar

నేడు నాగోబా జాతరలో కీలక ఘట్టం..

ఆదిలాబాద్‌: ఆసియాలో 2వ అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. నాగోబా జాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబా జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. జాతర 3వ రోజున జాతరలో అతి ముఖ్యమైన దర్బార్‌ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ నాగోబా దర్బార్, రేపు బేతల్ పూజలు, మండగాజిలింగ్.. ఎల్లుండి షాంపూర్ జాతర జరుగుతాయి. గిరిజనుల సమస్యలపై కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం దర్బార్ నిర్వహిస్తారు.

Advertisements
image

సమస్యలను నేరుగా అధికారులు-ప్రజాప్రతినిధులకు తెలిపేందుకు దర్బార్ జరుగుతుంది. 1942లో మొట్టమొదటిసారి నాగోబా దర్బార్ నిర్వహించారు. ఉట్నూర్ ఐటీడీఏ అధికారులతో పాటు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు గిరిజనుల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సమస్యల పరిష్కారం చేస్తారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షాతోపాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం,జిల్లాకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ దర్బార్‌కు హాజరవుతారు. కాగా, శనివారం బేతల్ పూజలు, మండగాజిలింగ్, ఆదివారం షాంపూర్ జాతర జరుగనున్నాయి.

గిరిజనుల ఆరాధ్య దైవం హైమన్ డార్ఫ్ ఆధ్వర్యంలో ఈ దర్బార్ జరిగింది. అడవిబిడ్డల సమస్యలపై అధ్యయనం చేయడానికి ఆనాడు హైమన్ డార్ఫ్ ను నిజాం సర్కార్ పంపిన విషయం తెలిసిందే. హైమన్ డార్ఫ్ ప్రారంభించిన దర్బార్ నేటికీ కొనసాగుతున్నది. ఇక, దర్బార్ రోజున తెలంగాణ జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు తరలివస్తారు. దర్భారులో ఆదివాసీలు తమ సమస్యలను ప్రజా ప్రతినిధులకు, ఆఫీసర్లకు విన్నవిస్తారు.దాంతో ఇక్కడ పాలకులు ఇచ్చే హామీలు నెరవేరుతాయని వారి విశ్వాసం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నిర్వహిస్తున్న నాగోబా జాతరలో భాగంగా గురువారం నాగోబా టెంపుల్ వెనుక మెస్రం వంశీయులు పెర్సపేన్, భాన్ దేవతకు ఘనంగా పూజలు నిర్వహించారు. భేటింగ్ అయిన కొత్త కోడళ్లు టెంపుల్​కు చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నాగోబా జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. నాగోబాను దర్శించుకుంటున్నారు.

Related Posts
మాజీ ప్రధాని షేక్ హసీనా ఆస్తుల సీజ్: ఢాకా కోర్టు ఆదేశాలు
మాజీ ప్రధాని షేక్ హసీనా ఆస్తుల సీజ్: ఢాకా కోర్టు ఆదేశాలు

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ Read more

ట్రంప్ ఎఫెక్ట్..చెదిరిపోతున్న భారత విద్యార్థుల కల?
donald trump

అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన ప్రకారం, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే Read more

ఐఏఎస్లు బానిసల్లా పనిచేయొద్దు – ఈటల
Government should support Telangana farmers.. Etela Rajender

ప్రభుత్వాలు ఐదేళ్లపాటు మాత్రమే , ఐఏఎస్ అధికారులు 35 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల తీరుపై భారతీయ జనతా పార్టీ Read more

TG High court : హెచ్‌సీయూ భూములపై విచారణ రేపటికి వాయిదా
Hearing on HCU lands postponed to tomorrow

TG High court : తెలంగాణ హైకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. రేపటి వరకు హెచ్‌సీయూ Read more

×