CMs Chandrababu and Revanth Reddy congratulated Telugu people on Bhogi festival

తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలుగు వారి లోగిళ్లలో పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. మూడు రోజుల పండుగలో తొలి రోజు భోగిని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు నేతలు తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements

ఏపీ ప్రజలందరికి సీఎం చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ అందరికి మరొక్క మారు భోగి పండుగ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

image
image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ, కొత్త కాంతులు పంచే భోగి మంటలు ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో అన్ని వర్గాలకు అంతా మంచి జరగాలన్నారు.

ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను అందించాలి. మీ వాంఛితాలన్నీ తీరి అత్యున్నత భోగాలు మీ సొంతం కావాలి. ప్రాకృతిక మార్పులతో సూర్యసంక్రమణ వేళ పీడలన్నీ వదిలి సర్వం భోగమయం కావాలనీ ఆ అమ్మవారిని కోరుకుంటూ హిందూ బంధువులకు భోగి పండుగ శుభాకాంక్షలు. – కేంద్ర మంత్రి బండి సంజయ్

ఈ భోగి మీ జీవితంలో.. భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ భోగి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

భోగి పండుగ మన అందరి జీవితాలలోకి భోగ భాగ్యాలని తీసుకురావాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ రోజున రంగుల ముగ్గుల్లాగా మన జీవితాలలో సంతోష హరివిల్లులు వెల్లువిరియాలి. కనుమ రోజు మనం కనే కలలన్నీ సాకారం చేయాలి. మనకి, ప్రకృతికి ఉన్న అవినాభవ సంబంధాన్ని సంక్రాంతి పండుగ గుర్తుచ్చేస్తుంది. సర్వేజనా సుఖినోభవంతు అంటూ భగవంతుణ్ణి కోరుకుంటూ తెలుగు ప్రజలకు ఆమె భోగి,సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts
సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ద్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్ర‌హం
Pawan Kalyan anger over the demolition of Muthyalamma statue in Secunderabad

హైదరాబాద్‌: ఈ నెల 13 ఆదివారం అర్దరాత్రి సమయంలోతెలంగాణలో జరిగిన అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ విగ్రహ Read more

ఇన్ఫోసిస్ పై కర్ణాటక ప్రభుత్వం చర్యలు
మైసూర్‌ క్యాంపస్‌ నుంచి ఇన్ఫోసిస్‌ ట్రైనీల తొలగింపు

ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్‌లో జరుగుతున్న సామూహిక ఉద్యోగుల తొలగింపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం Read more

Runamafi : రుణమాఫీ వల్ల రైతులు అటూ ఇటూ కాకుండా పోయారు – నిర్మల
runamafi

రుణమాఫీ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ అమలుకాని పరిస్థితి ఏర్పడినా, రాష్ట్ర ప్రభుత్వం Read more

‘జై హనుమాన్’లో హనుమంతుడిగా కాంతారా హీరో
jai hanuman

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న 'జై హనుమాన్' సినిమాఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నట్లు Read more

×