CM Yogi had lunch with sanitation workers

పారిశుద్ధ కార్మికుల‌తో క‌లిసి సీఎం యోగి భోజ‌నం..

మ‌హాకుంభ్ స‌క్సెస్..వ‌ర్క‌ర్ల‌కు 10వేల బోన‌స్‌

ప్ర‌యాగ్‌రాజ్‌: ప్ర‌యాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగిన మ‌హాకుంభ్ .. మ‌హాశివ‌రాత్రితో ముగిసింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ .. త్రివేణి సంగ‌మంలోని అరైల్ ఘ‌ట్ వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. బోటులో ప్ర‌యాణం చేసి .. గంగా హార‌తిలో పాల్గొన్నారు. యూపీ క్యాబినెట్ ఆ ఈవెంట్‌లో పాల్గొన్న‌ది. డిప్యూటీ సీఎం బ్ర‌జేశ్ పాఠ‌క్‌, కేపీ మౌర్య‌, ఇత‌ర మంత్రులు కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత పారిశుద్ధ కార్మికుల‌తో క‌లిసి సీఎం యోగి భోజ‌నం చేశారు. లంచ్‌లో మంత్రులు, పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.

పారిశుద్ధ కార్మికుల‌తో క‌లిసి సీఎం

శానిటేష‌న్ వ‌ర్క‌ర్ల‌కు క‌నీస వేతనం 16వేలు

సీఎం యోగి మాట్లాడుతూ.. మ‌హాకుంభ్‌లో పాల్గొన్న‌ శానిటేష‌న్, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు ప‌ది వేల బోన‌స్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి శానిటేష‌న్ వ‌ర్క‌ర్ల‌కు క‌నీస వేతనం 16వేలు అందే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. తాత్కాలిక హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు.. నేరుగా న‌గ‌దును బ్యాంక్ అకౌంట్ల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆ కార్మికుల‌కు ఆయుష్మాన్ భార‌త్ ఆరోగ్య బీమా క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. మ‌హాకుంభ‌లో సుమారు 66 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచ‌రించారు.

కొత్త రికార్డులు

కాగా, మహా కుంభమేళాలో స్నానం చేసేందుకు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నవారి సంఖ్య కొత్త రికార్డులను సృష్టించింది. కుంభమేళా నుండి తిరిగి వెళ్లినవారు వారితో పాటు ఈ పుణ్య జలాలను తమ ప్రాంతాలకు తీసుకువెళ్లి, లక్షలాది మంది చేత కుంభస్నానం చేయించారు. ఇది గత కొన్ని దశాబ్దాలలో ఇంతకు ముందెన్నడూ జరగని ఉదంతం. ప్రయాగ్‌రాజ్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అధికారులు మునుపటి కుంభమేళా అనుభవాల ఆధారంగా నూతన ప్రణాళికను రూపొందించారు. అమెరికా జనాభా కు దాదాపు రెట్టింపు జనాభా ఈ ఐక్యతా కుంభమేళాలో పాల్గొని స్నానాలు చేశారు.

Related Posts
రాహుల్​గాంధీ కులమేంటో చెప్పండి : రఘునందన్
Raghunandan Rao Sensational Comments On Rahul Gandhi

హైదరాబాద్‌: ప్రధాని మోడీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు స్పందించారు. మోడీ లీగల్లీ కన్వర్టెడ్​ బీసీ అని సీఎం వ్యాఖ్యానించారు. Read more

భారీ బందోబస్తు నడుమ ఢిల్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
EC is conducting the Delhi elections amid heavy preparations

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు భారీ భద్రత నడుమ పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుందని ఈసీ పేర్కొంది. మొత్తం 70 Read more

2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగామిని : జితేంద్ర సింగ్‌
భారత అంతరిక్ష లక్ష్యం: 2040లో మనిషిని చంద్రుడిపైకి పంపే యోచన

భారతదేశం అంతరిక్ష పరిశోధనలో గణనీయమైన పురోగతి సాధిస్తోంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకారం, భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా Read more

13 దేశాల నుండి 75 కు పైగా విశ్వవిద్యాలయాలతో హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రపంచ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహించిన టెక్సాస్ రివ్యూ..
The Texas Review organized the largest World Education Fair in Hyderabad with over 75 universities from 13 countries

హైదరాబాద్‌ : వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ యుఎస్ఏ , యుకె , ఫ్రాన్స్, జర్మనీ మొదలైన దేశాలతో సహా 13 దేశాలకు చెందిన 75 పైగా విశ్వవిద్యాలయాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *