हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

CM Chandrababu : నేడు గుంటూరుకు సీఎం.. ‘P-4’ సభ్యులతో భేటీ

Sudheer
CM Chandrababu : నేడు గుంటూరుకు సీఎం.. ‘P-4’ సభ్యులతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరు జిల్లాలోని పొన్నెకల్లును సందర్శించనున్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అక్కడ ఏర్పాటు చేసిన డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించనున్నారు. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా జరిగే కార్యక్రమాలకు,మరింత ప్రాధాన్యం ఉంది.

హాస్టల్ భవనానికి శంకుస్థాపన

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో వర్చువల్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వ సహాయాన్ని పొందుతున్నారు. విద్యా రంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను ఈ కార్యక్రమం బలంగా చాటుతోంది.

Chandrababu Naidu: బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం

‘P-4’ సభ్యులతో సమావేశం

తర్వాత సీఎం చంద్రబాబు ‘P-4’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో మార్గదర్శి-బంగారు కుటుంబ సభ్యులతో సమావేశమై అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వారి అభిప్రాయాలను వింటారు. ప్రజలతో నేరుగా మమేకం కావడం ద్వారా పాలనకు మరింత సమర్థతను తీసుకురావాలనే లక్ష్యంతో చంద్రబాబు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి మార్గంలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో ఈ సందర్బంగా ఆయన చర్చించనున్నట్లు సమాచారం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870