revanth notel

CM Revanth : జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిగ్ డీల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని “తెలంగాణ రైజింగ్” బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. జపాన్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ మరుబెనీ, తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపింది. ముఖ్యంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ఆధునిక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. టోక్యోలో జరిగిన సమావేశంలో సీఎంతో మరుబెనీ ప్రతినిధులు కలిసి, లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) పై సంతకాలు చేశారు.

Advertisements

సుమారుగా రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులు

ఈ పార్క్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ వంటి రంగాలపై దృష్టి సారించనుంది. ప్రాజెక్టు ప్రారంభం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు తమ తయారీ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా సుమారుగా రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్లు అంచనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. ఇది ఫ్యూచర్ సిటీలో మొదటి మెగా ప్రాజెక్ట్ కావడం గమనార్హం.

Revanth Reddy జపాన్ చేరుకున్న రేవంత్ రెడ్డి
Revanth Reddy జపాన్ చేరుకున్న రేవంత్ రెడ్డి

ప్రస్తుతం 65 దేశాల్లో 410 గ్రూప్ కంపెనీలతో వ్యాపార కార్యకలాపాలు

మరుబెనీ సంస్థ ప్రస్తుతం 65 దేశాల్లో 410 గ్రూప్ కంపెనీలతో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. వ్యవసాయం, ఫైనాన్స్, విద్యుత్, ఇంధనం, కెమికల్స్, ఏరోస్పేస్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఈ సంస్థ విశ్వవ్యాప్తంగా పేరు పొందింది. తెలంగాణను పెట్టుబడులకు ఆదర్శ గమ్యస్థానంగా మలచేందుకు జపాన్ పర్యటన మరో కీలక అడుగుగా నిలిచింది. ఫ్యూచర్ సిటీని దేశంలోనే తొలి నెట్-జీరో సిటీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Related Posts
CM Revanth Reddy : ప్రభుత్వ వైద్యులను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy praises government doctors

CM Revanth Reddy : హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యులను ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘నేను రానుబిడ్డో సర్కారు Read more

Stock markets: కాల్పుల విరమణతో భారీగా లాభాలు అందుకున్న స్టాక్ మార్కెట్లు
Stock markets: కాల్పుల విరమణతో భారీగా లాభాలు అందుకున్న స్టాక్ మార్కెట్లు

భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే విపరీతంగా Read more

US Visa : గర్ల్ ఫ్రెండ్ ఉందన్నందుకు యూఎస్ వీసా రిజెక్ట్
US VISSA

ఢిల్లీకి చెందిన ఓ యువకుడి నిజాయితీ అతడి అమెరికా కలను భగ్నం చేసింది. US వీసా కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలో ఎంబసీ ఆఫీసర్ అతడిని 'మీకు Read more

Turkey : కుప్పకూలిన టర్కీ ఆర్థిక వ్యవస్థ.. అదానీ ఒప్పందం రద్దు
Turkey : కుప్పకూలిన టర్కీ ఆర్థిక వ్యవస్థ.. అదానీ ఒప్పందం రద్దు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులకు కౌంటర్ గా పాకిస్థాన్ భారత్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×