CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు 10,006 మంది అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తీసుకోనున్నారు. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లా నుంచి 761 మంది.. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లా నుంచి 82 మంది కొత్త టీచర్లు నియామక పత్రాలను అందుకోబోతున్నారు. ఇప్పటికే ఎంపికైన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారు. ఇవాళ ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కొత్త టీచర్లను హైదరాబాద్‌ కు తీసుకురానున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో జిల్లాల వారీగా స్పెషల్ కౌంటర్ల ను ఏర్పాటు చేశారు. టీచర్లు ఎవరి జిల్లా కౌంటర్లలో వారు నియామక పత్రాలను తీసుకోవాలని అధికారులు సూచించారు. డీఎస్సీతో ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు దసరా సెలువులలోపే పోస్టింగ్స్ ఇచ్చేలా అధికారులు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

అయితే, డీఎస్సీ-2024లో భాగంగా మొత్తం 11,062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 10,006 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది. అందులో కోర్టు కేసుల నేపథ్యంలో 1,056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టుల భర్తీకి అవాంతరం ఎదురైంది. త్వరలోనే ఆ పోస్టుల భర్తీపై కూడా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

Related Posts
ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య
man commits suicide by hang

ఏపీలోని తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరగగా, Read more

పట్టభద్రుల హక్కుల సాధనకు కృషి చేస్తా : రాజశేఖరం
Will work to achieve the rights of graduates..Perabathula Rajasekharam

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మరో విజయం సాధించింది. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. మంగళవారం Read more

త్వరలో పుతిన్‌తో మాట్లాడతా : డొనాల్డ్ ట్రంప్
Will talk to Putin soon.. Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడి ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పరిష్కరించడంలో సహాయం చేస్తానని చెప్పారు. విస్తృత శ్రేణి సమస్యలపై Read more

ప్రేవేట్ బడుల్లో ఫ్రీ సీట్ల పై ప్రభుత్వం కసరత్తు
ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

హైదరాబాద్‌: వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ బడుల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే హైకోర్టుకు తెలుపగా, ఎలా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *