CM Revanth Reddy visit to Chennai

CM Revanth Reddy : చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాలిన్ నేతృత్వంలో శనివారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సైతం చెన్నై వెళ్లారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల భేటీకి స్టాలిన్ ఇచ్చిన పిలుపుతో అఖిలపక్షం సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెన్నై పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరే వరకూ అటు ఇరు రాష్ట్రాల పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయనున్నాయి.

Advertisements
చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డి

ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ

కాగా, కేంద్రప్రభుత్వం త్వరలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టబోతోంది. అయితే ఈ ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, హక్కులు దెబ్బతింటాయని సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు. పునర్విభజన జరిగితే 1971 జనాభా లెక్కల ఆధారంగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే రాజ్యాంగ సవరణలు జరగాలని అంటున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 22న చెన్నైకు రావాలని ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ రాశారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం చెన్నై వెళ్లింది.

Related Posts
ఎంఐసీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2025 బడ్జెట్ లక్ష్యాలు
MIC Electronics Ltd. has put forward budget targets for the year 2025

హైదరాబాద్ : LED డిస్ప్లే మరియు లైటింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (MICEL), రాబోయే కేంద్ర బడ్జెట్ 2025 పురస్కరించుకుని తమ అంచనాలను Read more

Fish: అయ్యో చేప ఎంత పని చేసింది చివరకు ఏమైంది
Fish: అయ్యో చేప ఎంత పని చేసింది చివరకు ఏమైంది

తమిళనాడులోని చెన్నై సమీపంలో ఒక విషాదకర సంఘటన జరిగింది.మధురాంతకంలో ఉంటున్న మణికందన్ అనే 29 ఏళ్ల వ్యక్తి తాను పట్టుకున్న చేప తన శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో మరణించాడు. Read more

బొమ్మలతో ఘనంగా జరిగిన రిపబ్లిక్ డే ఢిల్లీ
బొమ్మలతో ఘనంగా జరిగిన రిపబ్లిక్ డే .ఢిల్లీ.

ఈ రోజు భారత రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా, ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన పరేడ్ అదో అద్భుతమైన దృశ్యంగా మారింది. ఈ పరేడ్ దేశం Read more

CM Revanth Reddy : తెలంగాణలో విద్యా రంగం క్షీణించిపోతోంది : సీఎం రేవంత్‌ రెడ్డి
తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక తీర్మానం చేశారు. ఈ తీర్మానం ద్వారా తెలంగాణా ప్రభుత్వ స్టాండ్ ను ప్రకటించి, డీ లిమిటేషన్ విషయంలో కేంద్రంతో యుద్ధం ప్రకటించారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర వైఖరి మారాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజక వర్గాల పునర్విభజన - డీలిమిటేషన్ విధి విధానాలలో మార్పులు చేయాలని సూచించారు. శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ తీర్మానం శాసన సభలో డీ లిమిటేషన్ పై తీర్మానం ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు రాష్ట్రంలో శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభాలెక్కలకు అనుగుణంగా SC, ST స్థానాలను పెంచాలనీ కేంద్రాన్ని ఆయన కోరారు. డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లని విధంగా చేయాలని అభిప్రాయ పడ్డారు. నియోజక వర్గాల పెంపు పైన చర్చ దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ తో నష్టం కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజక వర్గాల పెంపు పైన చర్చ జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదు గతంలో ఇందిరాగాంధీ ఆమోదించలేదన్న సీఎం రేవంత్ గతంలో ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక తాజాగా మరోమారు నియోజకవర్గాలు పునర్విభజన అంశం తెర మీదికి రావడంతో దక్షిణాది రాష్ట్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా అందరితో కలిసి కేంద్రానికి ఎదురుగా నిలబడి పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కడ్బందీగా కుటుంబ నియంత్రణ అమలు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై రేవంత్ ఆందోళన దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని, ఫలితంగా రాష్ట్రాలకు నష్టం జరిగితే ఊరుకోబోమన్నారు. ప్రభుత్వ విధానాన్ని సమగ్రంగా అమలు చేసినందుకు తమకే బెనిఫిట్ జరిగేలా చూడాలన్నారు. ఒకవేళ ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చట్టసభలలో 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్ విషయంలో రేవంత్ డిమాండ్ ఇదే డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని శాసన సభ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని ఆయన తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని డిమాండ్ చేశారు.

CM Revanth Reddy : తెలంగాణలో విద్యాశాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిస్థాయిలో విద్యా రంగం రోజు రోజుకూ క్షీణించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×