CM Revanth Reddy to visit Japan on 15th of this month

CM Revanth Reddy : ఈనెల 15న జపాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి జపాన్ టూర్ షెడ్యూల్ దాదాపు ఖరారు అయ్యింది. ఏప్రిల్ 15 నుంచి అక్కడ పర్యటించనున్నారు. పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి జపాన్‌ టూర్ ఓకే అయ్యింది. ఏప్రిల్‌ 15 నుంచి 23 వరకు ఒకాసా ఎక్స్‌పో-2025 హాజరుకానున్నారు.

Advertisements
ఈనెల 15న జపాన్‌కు సీఎం

సీఎం బృందం ఏయే కంపెనీల ప్రతినిధులతో భేటీ

సీఎం రేవంత్ రెడ్డితోపాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ ఇతర అధికారులు వెళ్తున్నారు. జపాన్‌ పర్యటన విజయవంతం చేయడంపై దృష్టి పెట్టారు అధికారులు. సీఎం బృందం ఏయే కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యే ప్రణాళికను పరిశ్రమల శాఖ రెడీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జపాన్‌ లోని ఫేమస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

దాదాపు ఎనిమిది రోజులు జపాన్ పర్యటన

ఒప్పందాలపై చర్చించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జపాన్‌ పర్యటన తర్వాత జూన్‌ లేదా జులై‌లో అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి పెట్టుబడులను ఆహ్వానించడానికి అధికారుల కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. దాదాపు ఎనిమిది రోజులు జపాన్ పర్యటనలో ఉండనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధితో పాటు పెట్టుబడులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటులో సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతోపాటు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే అవకాశం ఉంది.

Read Also: పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు..అధికారులు వెల్లడి

Related Posts
SLBCTunnel: 37వ రోజు కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ రెస్కూ ఆపరేషన్‌
SLBCTunnel: 37వ రోజు కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ రెస్కూ ఆపరేషన్‌

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు 37వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికీ మిగతా ఆరుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికార యంత్రాంగం, సహాయక బృందాలు నిరంతరాయంగా Read more

Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ.. నేటితో ముగియనున్న గడువు
ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ.. నేటితో ముగియనున్న గడువు

Property Tax : ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 25న 50 శాతం రాయితీ Read more

Helicopter crash: శ్రీలంకలో సైనిక హెలికాప్టర్ కూలిన ఘ‌ట‌న – ఆరుగురు సైనికుల మృతి
Helicopter crash: శ్రీలంకలో సైనిక హెలికాప్టర్ కూలిన ఘ‌ట‌న – ఆరుగురు సైనికుల మృతి

శ్రీలంక‌లో సైనిక హెలికాప్ట‌ర్ (Helicopter)కూలింది. ఓ రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌లో ఆరు మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. శిక్ష‌ణ విన్యాసాల స‌మ‌యంలో Read more

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతుని నాశనం చేస్తుంది: కేటీఆర్
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతుని నాశనం చేస్తుంది: కేటీఆర్

భూముల అమ్మకంపై కాంగ్రెస్ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో భూ వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కంచే-గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు సన్నాహాలు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×