CM Revanth Reddy Japan visit schedule finalized

Japan Tour: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారు

Japan Tour : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఎనిమిది రోజులు జపాన్ పర్యటనలో ఉంటారు. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారితన అభివృద్ధితో పాటు తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతోపాటు స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే ఛాన్స్ ఉంది.

 సీఎం రేవంత్ రెడ్డి జపాన్

వచ్చేనెల 15 నుండి 23 వరకు ఈ జపాన్ పర్యటన

ఒసాకా లో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఈ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు జపాన్ కి మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు వెళ్ళనున్నారు. సీఎం ఏప్రిల్ నెలలో జపాన్ పర్యటనకు వెళ్తారు. ఎప్రిల్ 15 నుంచి 23 వరకు జపాన్ పర్యటన కు వెల్లనున్నారు. ఏప్రిల్ 15 లోపు డీ లిమిటేషన్ పై హైదరాబాద్‌లో రెండో మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ బయల్దేరి అక్కడి నుంచి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.

Related Posts
కేటీఆర్‌కు మళ్లీ ఏసీబీ నోటీసులు..!
ACB notices to KTR once again..!

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై ఏసీబీ అధికారులు లీగల్ Read more

ఈ దశాబ్దం గ్లోబల్ టాలెంట్ మొబిలిటీలో అగ్రగామిగా భారతదేశం
With 7% growth in employability, India to emerge as global powerhouse for skilled talent by 2030

వీబాక్స్ ఈటీఎస్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025, CII, Taggd, AICTE మరియు AIU భాగస్వామ్యంతో , "గ్లోబల్ టాలెంట్ మొబిలిటీ" కోసం ఒక వ్యూహాత్మక లక్ష్యంను Read more

భారత్-చైనా ఒప్పందం: కైలాష్ మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం
భారత్-చైనా ఒప్పందం: కైలాష్ మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం

2020 నుండి కైలాష్ మానస సరోవర్ యాత్రను నిలిపివేశారు. దీనికి కారణం మహమ్మారి COVID-19. ఇపుడు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం చైనాతో ఒప్పందం కుదుర్చుకొని Read more

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ రూ.100కోట్ల విరాళం
adani foundation contribute

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ రూ.100కోట్ల విరాళం అందజేసి తమ గొప్ప మనసు చాటుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *