Japan : పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

Read Time:  1 min
Japan : పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
FONT SIZE
GET APP

Japan తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బిజీబిజీగా పర్యటన కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి బెంగళూరులో నుండి బయలుదేరిన సీఎం బృందం బుధవారం మధ్యాహ్నం టోక్యో ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. అక్కడి అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటన ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమా నగరాలను సీఎం సందర్శించనున్నారు. ముఖ్యంగా వరల్డ్ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పర్యటన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపనున్నది.

Japan : సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ డెలిగేషన్‌కి Japan ని ఇండియన్ అంబాసిడర్ షిబూ జార్జ్ విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందులో డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, మాజీ కేంద్ర మంత్రి నెపోలియన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. టోక్యోలోని వంద సంవత్సరాల పాత భవనంలో ఈ సమావేశం జరిగింది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, రాయితీలను వివరించనున్నారు.

Read more : Bhubharathi : నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు

Digital

రచయిత గురించి

Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.