CM Revanth Reddy comments on ktr

CM Revanth Reddy : కేటీఆర్ నాకు, నీకు పోలికే లేదు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాకు, నీకు పోలికే లేదు అని అన్నారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 70 సార్లు మిస్ వరల్డ్ పోటీలు ఇతర దేశాల్లో జరిగాయి. మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ ఎందుకు అని కేటీఆర్ అడుగుతున్నారు. ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వ నిధులు కొల్లగొట్టావు.. కేటీఆర్ నీకు నాకు పోలిక ఏంటి..? అన్నారు.

కేటీఆర్ నాకు నీకు పోలికే

18 గంటలు పని చేసే నాకు పట్టులేదట

ఎంత పెద్దోడు అయినా బిల్డ్ నౌ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాల్సందే. కొందరూ మార్కెటింగ్ చేస్తున్నారు. మా లాంటి వాళ్లు కష్టపడుతున్నారు. ఉద్యోగాలు ఇచ్చినందుకు నాపై కోపం ఉందా..? సోషల్ మీడియా పెట్టుబడిదారులది అన్నారు. 18 గంటలు పని చేసే నాకు పట్టులేదట. మేము ధర్నా చేయనియకపోతే పట్టు ఉన్నట్టా..? అని ప్రశ్నించారు. మనుషుల్లో ఉన్న క్రూర మృగాలను నల్లమల్లలో పెరిగిన నాకు గుర్తుపట్టరాదా..? అన్నారు.

11 శాతం ఇంట్రెస్ట్ తో అప్పులు తెచ్చిండు కేసీఆర్

పట్టింపు లేని నీ విధానం.. పట్టుదలతో పని చేయడం మా విధానం.. కేసీఆర్ చేసిన అప్పులు.. చేసిన తప్పులకు లక్ష 53 వేల కోట్లు కట్టిన అని సీఎం రేవంత్ తెలిపారు. లక్ష 53 వేల కోట్లు నా దగ్గర ఉంటే క్షణం లో 2 లక్షల రుణాలు మాఫీ చేసే వాణ్ణి.. ఓ వ్యక్తి చేసిన అప్పులకు మనం తిప్పలు పడుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ లు 8000 కోట్లు పెండింగ్ పెట్టారు. 11 శాతం ఇంట్రెస్ట్ తో అప్పులు తెచ్చిండు కేసీఆర్. 4 శాతం ఇంట్రెస్ట్ కి అప్పు ఇవ్వడానికి చాలా బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి.

Related Posts
జ‌గ‌న్ మీద బుర‌ద జ‌ల్లుతున్నారంటూ మాజీ మంత్రి రోజా ఫైర్
roja

అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ , వైస్ షర్మిల చేసిన కామెంట్స్ Read more

జవాహర్ లాల్ నెహ్రూ: భారతదేశానికి శక్తివంతమైన నాయకత్వం ఇచ్చిన వ్యక్తి
jawaharlal nehru2

జవాహర్ లాల్ నెహ్రూ, భారతదేశం యొక్క తొలి ప్రధాని మరియు స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ స్వాతంత్ర్యానికి ఎన్నో త్యాగంచేసి, భారతదేశాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ దృష్టుల నుండి ఆధునిక Read more

జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్
jani master

జానీ మాస్టర్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో 36 రోజుల తరువాత ఆయన చంచల్ గూడా జైలు నుంచి విడుదలయ్యారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలతో Read more

పార్లమెంట్‌ ముందు ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి నిర్మలా
Minister Nirmala introduced the economic survey before the Parliament

న్యూఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వే ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *