revanth reddy

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన సీఎం రేవంత్ ఫోకస్ చేసారు. ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ ల పదవీ కాలం ముగిసిన ఏడాది పూర్తవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో, ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారుతోంది. దీంతో, ఈ రోజు ఎన్నికల పైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రేవంత్ సమావేశం తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం మొదలవుతోంది. అయితే, ముహూర్తం పైన ఈ రోజు స్పష్ట త వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులు, అధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీంతో, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇప్పటికే కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. ఈ రోజు సమావేశంలో ఈ నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం కనిపిస్తోంది. మంత్రులు, అధికారులతో చర్చించిన తరువాత రిజర్వేషన్ల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాతనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం.

మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిలో 4 వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఇంటర్‌, డిగ్రీ పరీక్షలు, మే నెలలో వివిధ ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ఆ తరువాత వేసవిలో వచ్చే సహజమైన సమస్యలు ఎన్నికల నిర్వహణ.. ఫలితాల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. నీటి ఎద్దడి, విద్యుత్ కోతలు వంటివి ప్రతిపక్షాలకు అవకాశం మారే ఛాన్స్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.ఎన్నికల సమరం దీంతో, ఫిబ్రవరిలోనే ఎన్నికలకు వెళ్తారా.. లేక జూన్ తరువాత నిర్వహిస్తారా అనేది ఈ భేటీలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

Related Posts
అర్ధరాత్రి వెలిసిన మావోయిస్టు ఫ్లెక్సీలు
Maoist flexi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు పంచాయతీలోని సందళ్లు రాంపురంలో గ్రామంలో మణుగూరు-పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల ఫ్లెక్సీలు వెలిశాయి. "మావోయిస్టు Read more

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
hyd Traffic Restrictions

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నేడు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం వద్ద ఉదయం 7:30 గంటల Read more

హైదరాబాద్ లో రెండు చోట్ల హాష్ ఆయిల్ సీజ్
Hash oil

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో 300 ఎం.ఎల్. హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ అధికారులు సీజ్ చేశారు. బండ్లగూడలో ఓ కిలేడి లేడీ రహస్యంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు Read more

ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన సర్కార్
tgsrtc emplayess

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వం ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు చర్చలకు హాజరుకావాలని ఆహ్వానించింది. ఈ సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *