New law in AP soon: CM Chandrababu

జనవరిలో దావోస్‌కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

అమరావతి: సీఎం చంద్రబాబు వచ్చే ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయనతోపాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. సీఎం పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అధికారుల బృందం నిన్న దావోస్‌కు పయనమైంది. ఏపీ నుంచి వెళ్లిన ఈ ముగ్గురు అధికారుల బృందం ఈ నెల 22 వరకు దావోస్‌లో ఉంటుంది.

దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు అవసరమైన ప్రదేశాలను ఈ అధికారుల బృందం ఎంపిక చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులకు అవసరమైన సహకారం, ఏర్పాట్లపై దావోస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో అధికారుల బృందం చర్చిస్తుంది. వచ్చే ఏడాది దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాలను ‘షేపింగ్‌ ద ఇంటెలిజెంట్‌ ఏజ్‌’ అన్న థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

కాగా, ఈ దావోస్ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు హాజరవుతారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో దావోస్‌ సదస్సుకు రాష్ట్రం నుంచి ప్రతినిధుల బృందం కచ్చితంగా హాజరయ్యేది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు లీడ్ చేసేవారు.. పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఆ ఐదేళ్లలో దావోస్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అనంతరం పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

Related Posts
హిందీ జాతీయ భాష కాదు: రవిచంద్రన్ అశ్విన్
హిందీ జాతీయ భాష కాదు: రవిచంద్రన్ అశ్విన్

స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఒక ప్రైవేట్ కళాశాల కార్యక్రమంలో పాల్గొని, తన కెరీర్ విషయంతో పాటు భారతదేశంలో హిందీ భాష స్థితిగతులపై వ్యాఖ్యలు చేసి Read more

మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు
మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి: తండ్రి ఆనందం, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్టులో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్

మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి: తండ్రి ఆనందం మెల్బోర్న్‌లో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్టులో భారత ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి Read more

రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి
Nobel Prize in Chemistry for three scientists

స్టాక్‌హోం: రసాయన శాస్త్ర విభాగంలో 2024 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకారం.. ఈ సంవత్సరం ముగ్గురికి ఈ గౌరవం Read more

ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు విజయం
Uttarandhra results are out

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన విజేతగా ప్రకటించబడ్డారు. లెక్కింపు Read more