CM Chandrababu pays tribute to Babu Jagjivan Ram

CM Chandrababu : బాబు జగ్జీవన్ రామ్‌కి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలోనూ స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని కొనియాడారు. ఈ మేరకు సోషల్ మాధ్యమంలో సీఎం చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన బాబూ జగ్జీవన్ రామ్‌ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Advertisements
image

దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి

ఇక, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలు నిరుపమానవని అభివర్ణించారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషిచేశారని ఉద్ఘాటించారు.

అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడాలి

మరోవైపు భారతదేశానికి బాబూ జగ్జీవన్ రామ్‌ అందించిన సేవలు చాలా గొప్పవని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళి అర్పించారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడారని తెలిపారు. వారి హక్కుల కోసం ఆయన జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని మోడీ కొనియాడారు.

Read Also: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. రేపు వైన్స్ లు బంద్

Related Posts
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ
ap cabinet meeting

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించిన కొత్త పాలసీలపై చర్చించబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేబినెట్ Read more

london airport : లండన్‌లో భారీ అగ్ని ప్రమాదం – హీత్రూ విమానాశ్రయం మూసివేత
లండన్‌లో భారీ అగ్ని ప్రమాదం – హీత్రూ విమానాశ్రయం మూసివేత

లండన్‌లోని ఒక ప్రధాన విద్యుత్‌ సబ్-స్టేషన్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం వల్ల హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వేలాది నివాసాలకు విద్యుత్‌ సరఫరా Read more

పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు
పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు

ఆంధ్రప్రదేశ్ లో ని పల్నాడు జిల్లా నరసరావుపేటలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రివేళ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌లు, ఆటోలు టార్గెట్ చేస్తూ ముఠాలు చోరీలకు Read more

మన్మోహన్ గొప్ప దార్శనికుడు : మాజీ రాష్ట్రపతి
Ram Nath Kovind mourns the death of Manmohan Singh

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. మన్మోహన్‌ సింగ్‌ భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×