CM Chandrababu: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (బుదవారం) మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం. కాగా మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం
బిల్గేట్స్తో భేటీ అనంతరం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. అదేరోజు రాత్రికి అమరావతి నుంచి తిరుమల వెళ్తారు. 21న ముఖ్యమంత్రి తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. 21న కుటుంబ సమేతంగా మనువడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటారు.
రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని మోడీని సీఎం ఆహ్వానించనున్నారు. పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆర్థికమంత్రి నిర్మలాను కోరనున్నారు. అనంతరం ఢిల్లీలో ఓ వివాహ వేడుకలో సీఎం పాల్గొననున్నారు.